E-Paper
Advertisement

Fish @ Rs. 2 Lakhs: దేవుడా.. ఒక్క చేప ధర రూ. 2 లక్షలు.. ఎక్కడో తెలుసా?

Fish @ Rs. 2 Lakhs: దేవుడా.. ఒక్క చేప ధర రూ. 2 లక్షలు.. ఎక్కడో తెలుసా?
Advertisement

Single Fish Price is 2 Lakh Rupees: చేపలు పట్టే జాలర్లకు కొన్ని సార్లు ఎంత వెతికినా సరైన చేపలు దొరకవు. ఎన్ని చేపలు దొరికినా వాటిలో అద్భుతమైన చేపలు దొరకడం చాలా అరుదు. అదే ఒక్కసారి జాలర్ల చేతికి చిక్కాయంటే చాలు ఏకంగా వేలు, లక్షల్లోనే రేటు పలుకుతుంది. తాజాగా ఏపీలో అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. ఒక మత్స్యకారుడి చేతికి ఏకంగా లక్షల విలువ చేసే చేపలు చిక్కాయి. దీనికి సంబంధించిన ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

సాధారణంగానే పులుస చేపలు అత్యధిక ధర పలుకుతాయి. ఎందుకంటే వాటి రుచి, వాసన అనేది మాంసంప్రియులకు అంత మక్కువ. వేల రూపాయలు ఖర్చు చేసి మరి పులుస చేపలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ పులుస చేపలకు మరో పేరు కూడా ఉంది. వీటినే కచ్చిడీ చేపలు అని కూడా అంటారు.

Advertisement

ఒక్క చేప అంత కొడితే రూ. 300 నుంచి రూ. 500లోపు ఉంటుంది. ఇక సీజన్, చేపలను బట్టి ఇక వేల రూపాయలు ఉంటాయి. కానీ ఏపీలో చేప మాత్రం ఏకంగా లక్షల రూపాయల ధర పలుకుతుంది. పులుస చేపలకు ధర ఎక్కువ ఉంటుందని తెలిసిందే.. కానీ మరీ లక్షల్లో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. అంతర్వేదీ సముద్ర తీరంలో ఓ చేప ఏకంగా రూ. 2 లక్షలు పలికింది. రెండు కచ్చిడి చేపలు కలిపి రూ. 4 లక్షలు పలికింది. దీనిని డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపల్లి పాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో దీనిని వేలం వేశారు. ఏకంగా రెండు చేపలకు రూ. 4 లక్షలు పలకడం హాట్ టాపిక్ గా మారింది. దీనిని కొనుగోలు చేసి తినాలంటే ఇక కోటిశ్వరులకు మాత్రమే సాధ్యం అని అందరూ చర్చించుకుంటున్నారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×