BigTV English
Advertisement

Purandeswari : పొత్తులపై అధిష్టానికి వివరిస్తాం.. అధిష్టాన నిర్ణయమే పైనల్.. పురందేశ్వరి..

Purandeswari : రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఏపీ బీజేపీ నేతల కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రెండో రోజు పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ సమావేశంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఇతర అంశాలపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు.

Purandeswari : పొత్తులపై అధిష్టానికి వివరిస్తాం.. అధిష్టాన నిర్ణయమే పైనల్.. పురందేశ్వరి..

Purandeswari : రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఏపీ బీజేపీ నేతల కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రెండో రోజు పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ సమావేశంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఇతర అంశాలపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు.


జనసేన పార్టీ మా మిత్రపక్ష పార్టీ అన పురందేశ్వరి అన్నారు. షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు? మా పార్టీ బలోపేతం కోసం మేం పనిచేస్తామన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించామని పురందేశ్వరి తెలిపారు. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్ఠానానికి వివరిస్తామన్నారు. అంతిమ నిర్ణయం అధిష్ఠానానికే వదిలేస్తున్నామని ఆమె తెలిపారు.

ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించామని జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తెలిపారు. హామీలు అమలు చేయని ప్రభుత్వంపై పోరాడతామన్నారు. బీజేపీపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. బీజేపీలో కొత్త నేతల చేరికలపై దృష్టి సారించామన్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పొత్తుల అంశంపై సమావేశంలో చర్చించామని తెలిపారు. పొత్తుల అంశంపై మేం ఒక్కరమే తీసుకునే నిర్ణయం కాదన్నారు.


మాతో పొత్తు పెట్టుకోవాలనుకొనే వారు కూడా స్పందించాలని సత్యకుమార్ తెలిపారు. పొత్తు కోరేవారు అధిష్ఠానంతో మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉందని, టీడీపీతో పొత్తులో కలిసి రావాలని జనసేన అధినేత పవన్‌ చెబితే సరిపోతుందా? అని సత్యకుమార్ ప్రశ్నించారు. పొత్తు కోరేవారు ముందుకు వస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. బీజేపీ పదాధికారుల సమావేశం ముగిసిన తర్వాత జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో భేటీ అయ్యారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×