Raghurama Raju Warning: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తనపై వస్తున్న రకరకాల వార్తలకు క్లారిటీ ఇచ్చారు. తనదైన శైలిలో ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆరోపణలకు సంబంధించి తాను నిర్ధోషిగా బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రత్యర్థులపై తనదైన శైలిలో చెలరేగిపోయారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మాస్ వార్నింగ్
శుక్రవారం ఉదయం మీడియా ముందుకొచ్చారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. ఆరోపణలు వస్తున్న కేసులో ఎలాంటి ఛార్జిషీటు వేయలేదన్నారు. కానీ ప్రత్యర్థులు మాత్రం వాటి గురించి డిసైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపైనా రుసరుసలాడారు.
11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? ఏమైనా బుద్ధి, బుర్ర ఉందా? చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని, అంత మాత్రాన పదవి నుంచి తొలగిస్తారా? అంటూ ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగ పదవిలో ఉండడం వల్ల ఏడాదిగా సంయమనం పాటించానని అన్నారు. ఎవరు పడితే వారు.. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు.
ఈ పదవిలో ఉండడం వల్లే సైలెంట్గా ఉన్నా
కొందరు వ్యక్తుల గురించి మాట్లాడనని తేల్చేశారు. సాక్షి రాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి ఉడత ఊపులకు ఎవరూ భయపడరన్నారు. తన కేసుపై తాను పోరాటం చేస్తానని, ఇందులో ఎవరి మద్దతు అవసరం లేదన్నారు. అందులో మేటర్ లేదని ఒక్కముక్కలో తేల్చేశారు. 2020 నుంచి పోరాటం మొదలు పెట్టానని వివరించారు.
తాను ఏ తప్పు చేయలేదని, తనకు-పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరివర్తన వస్తే వచ్చే ఎన్నికల్లో అయినా ప్రతిపక్ష హోదా వస్తుందని భావించానని తెలిపారు. జగన్ గతంలో తనను తాను ఓడించుకున్నారని, అతణ్ణి ఎందుకు ఓడించాలని రెండేళ్లు ముందు వివరించి చెప్పానని గుర్తు చేశారు.
ALSO READ: ఫ్లెక్సీ వార్.. సీఐపై రెచ్చిపోయిన కారుమూరి