E-Paper
Advertisement

Raghurama Krishnaraju: పాల్ జైలు పాలయ్యాడు సరే.. అసలు సూత్రధారి ఎక్కడ? – రఘురామ

Raghurama Krishnaraju: పాల్ జైలు పాలయ్యాడు సరే.. అసలు సూత్రధారి ఎక్కడ? – రఘురామ

Raghurama Krishnaraju: సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ను అరెస్ట్ చేయడం సంతోషంగా అని పించిందని ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు అన్నారు. ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని ఆరోపించారు. ఆయన పాపం పండిందని, తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారని వ్యాఖ్యానించారు. త‌నను కస్టోడియల్ టార్చర్ చేశారని గుర్తు చేశారు. అసలు కుట్ర చేసింది పీవీ సునీల్ కుమార్ అని అన్నారు. త‌నను కస్టోడియాల్ టార్చర్ చేసిన వారిలో కీలక నిందితుడిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారని ఆనందం వ్య‌క్తం చేశారు. అందరూ కలిసి కుట్ర చేశారని, ఇప్పటికే ఆలస్యం అయ్యిందని భావించారు.

పీవీ సునీల్ కుమార్ ప్రధాన నిందితుడని, ఆయన తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పీవీ సునీల్ కుమార్ కి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలని ర‌ఘురామ డిమాండ్ చేశారు. పీవీ సునీల్ కుమార్ దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసుల పై ఉందని అన్నారు. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంతా ఒక ముఠా.. అని వ్యాఖ్యానించారు. త‌నను టార్చర్ చేసిన వారికి న్యాయస్థానంలో తప్పకుండా శిక్షపడుతుందని నమ్మకం ఉందని అన్నారు. A5 కి హాస్పటల్ సూపర్ డెంట్ ప్రభావతి పేరును కూడా ఎఫ్.ఐ ఆర్ లో నమోదు చేశార‌ని చెప్పారు. మెడికల్ రిపోర్ట్ కూడా అప్పుడు ఇవ్వలేదని, ఈ కేసులో అందరినీ శిక్షించడానికి ఎక్కువ సమయం పట్టదని హెచ్చ‌రించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×