Congress Party: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దూకుడు పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇకపై నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఏపీ నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండున కాంగ్రెస్ అగ్రనేతలు అక్కడికి రానున్నారు.
ఫిబ్రవరి రెండున ఏపీకి కాంగ్రెస్ అగ్రనేతలు
ఈ మధ్యకాలంలో మోదీ సర్కార్.. అభివృద్ధి పేరిట రకరకాలుగా పేర్లు మార్చడం మొదలు పెట్టింది. చివరకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాల పేర్లను మార్చుతోంది. కాంగ్రెస్ మానస పుత్రికగా పేర్కొన్న పథకాల్లో ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ’ ఒకటి. ఆ పథకాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ‘వీబీ జీ రామ్ జీ’గా మార్చేసింది.
దీనిపై పార్లమెంటు ఉభయసభల్లో ఆ పార్టీ నేతలు ఆందోళన చేశారు. అయినా ఎన్డీయే ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలని కాంగ్రెస్ అగ్రనేతలు డిసైడ్ అయ్యారు. ఈ పథకం కోసం ఆందోళనలు చేయడానికి ఎందుకు ఏపీని ఎంచుకున్నారు? అన్న డీటేల్స్ లోకి లోతుగా వెళ్దాం.
మొదలు పెట్టిన నుంచే ఆందోళనకు శ్రీకారం
రెండు దశాబ్దాల కిందటి మాట. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004లో కొలువు దీరింది. ప్రధాని మన్మోహన్సింగ్ హయాంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని 2006, ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. ఆనాటి నుంచి నేటివరకు అంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ పథకం సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. పథకం పేరు మార్చడం, దానికి మార్పులు చేర్పులు చేయడం జరిగింది.
ALSO READ: గజగజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఆ పథకం మొదలు పెట్టారో కాంగ్రెస్ పెద్దలు, అక్కడి నుంచి ఆందోళనలు దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టాలని ఇటీవల జరిగిన సీడబ్య్లూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2న ఏపీకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలు రానున్నారు. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని బండ్లపల్లి నుంచి ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ ఆందోళన ద్వారా మోదీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టనున్నారు. అంతేకాదు అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ఫిబ్రవరి 2వ తేదీ 2006లో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించిన ఆనాటి భారత ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు, యు. పి. ఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ… pic.twitter.com/Z5cKLbcYMD
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) December 31, 2025