E-Paper
Advertisement

Tirupati To Shirdi: తిరుపతి నుంచి షిర్డీకి ప్రతీ రోజూ ట్రైన్.. సీఎం చంద్రబాబు సూచన, రైల్వేశాఖ ఆమోదం

Tirupati To Shirdi: తిరుపతి నుంచి షిర్డీకి ప్రతీ రోజూ ట్రైన్.. సీఎం చంద్రబాబు సూచన, రైల్వేశాఖ ఆమోదం
Advertisement

Tirupati To Shirdi: ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఏపీ నుంచి వివిధ రాష్ట్రాలకు రైళ్లు, విమానాలు కనెక్ట్‌విటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి -షిర్డీకి ట్రైన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఒకప్పుడు వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉండేది. సీఎం చంద్రబాబు రైల్వేమంత్రికి లేఖ రాశారు. దీంతో ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇకపై ఈ రెండు టెంపుల్ సిటీల మధ్య ప్రతీరోజూ రైలు భక్తులకు అందుబాటులోకి రానుంది.

ఏపీ ప్రజలకు కేంద్రప్రభుత్వం ఓ శుభవార్త చెప్పేసింది. ఇకపై ప్రతిరోజూ తిరుపతి-షిర్డీ మధ్య ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఈ రెండు టెంపుల్ సిటీల మధ్య వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉండేది. ఇకపై రెగ్యులర్ సర్వీసు కానుంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన చేసింది.

Advertisement

రానున్న పండుగల నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి నుంచి షిర్డీ మధ్య 07637/07638 నెంబర్‌తో రోజూ ట్రైన్ నడపనున్నట్లు పేర్కొంది. కొద్దిరోజుల కిందట సీఎం చంద్రబాబు రైల్వేమంత్రికి ఓ లేఖ రాశారు. ఆయన ప్రతిపాదనను కేంద్రం ఆమోదం తెలిపింది.

విచిత్రం ఏంటంటే ఈ రైలు ఏపీ-తెలంగాణ ప్రాంతాల మీదుగా నడిపితే ఆ రైలు నిత్యం బిజీగా ఉండేదని అంటున్నారు భక్తులు. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ స్టేషన్ల మీదుగా షిర్డీకి చేరుకోనుంది. తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకున్న కేంద్రం, ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

ALSO READ: టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్, వైసీపీకి చెమటలు

తిరుమలకు వెళ్లేవారికి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇటీవల కొన్ని రైళ్లను నవంబర్ వరకు పొడిగించిన విషయం తెల్సిందే. తిరుపతి-షిర్డీ, నరసాపురం-అరుణాచలం మధ్య నడిచే రైళ్లతోపాటు హైదరాబాద్-కొల్లాం, కాచిగూడ-మధురై మార్గాల్లో ప్రత్యేక రైళ్లు తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుంటారని అధికారులు భావిస్తున్నారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×