Ola Shut Down| ఓలా ఎలక్ట్రిక్ మార్చి చివరి నాటికి దాదాపు 150 రిటైల్ స్టోర్లను మూసివేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 700 అవుట్లెట్లు ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా మొత్తం 550 స్టోర్లు మాత్రమే మిగిలి ఉంటాయి. గత కొద్ది నెలలుగా సేల్స్ గణనీయంగా తగ్గడంతో ఓలా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో పోటీ పెరగడం కూడా కంపెనీ సేల్స్ తగ్గడానికి కారణం. లాభదాయక విధానాలు అమలు చేసే ప్రక్రియలో భాగంగా కంపెనీ ఖర్చులు తగ్గించాలని భావించింది.
గత రెండు సంవత్సరాల్లో ఓలా ఎలక్ట్రిక్ చాలా ఆక్రమణాత్మకంగా రిటైల్ నెట్వర్క్ను విస్తరించింది. నగరాలు, పట్టణాల్లో ఫిజికల్ ప్రెజెన్స్ బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ సేల్స్ వృద్ధి చాలా నెమ్మదిగా ఉండడంతో వ్యూహంలో మార్పులు చేస్తోంది. ఇప్పుడు ఆర్థిక స్థిరత్వం, ఆపరేషనల్ ఎఫిషియెన్సీపై దృష్టి పెడుతోంది.
భారత్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ తీవ్రంగా పెరిగింది. జనవరిలో TVS మోటార్.. ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్లో టాప్ స్థానంలో నిలిచింది. 33,296 యూనిట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్తో పోలిస్తే 32 శాతం పెరుగుదల. TVS iQube స్కూటర్ చాలా పాపులర్ అయింది. బజాజ్ ఆటో కూడా జనవరిలో 28శాతం పెరుగుదలతో 24,211 యూనిట్లు అమ్మింది. బజాజ్ చేతక్ స్కూటర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో 9,027 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గతంతో పోలిస్తే ఈ సేల్స్ 20 శాతం తగ్గుదల. గతంలో ఓలా మార్కెట్ లీడర్గా ఉండేది కానీ ఇప్పుడు మార్కెట్ షేర్ తగ్గింది.
కస్టమర్ సర్వీస్ సమస్యలు ఓలా ఎలక్ట్రిక్ పర్ఫామెన్స్పై ప్రభావం చూపాయి. సర్వీస్ ఆలస్యం, సపోర్ట్ క్వాలిటీపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. దీనివల్ల బ్రాండ్ ఇమేజ్పై నెగెటివ్ ప్రభావం పడింది. ఈ కారణంగా కంపెనీ తన బ్రాండ్ ఇమేజ్ మెరుగుపరచడానికి హైపర్సర్వీస్ ప్రోగ్రామ్ ప్రారంభించింది.
ఈ ప్రొగ్రామ్లో ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్, రిపేర్ సర్వీసెస్ మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీతో వాహనాలు డెలివరీ చేస్తోంది. S1 Pro+ మోడల్లో 4680 భారత్ సెల్స్ ఉపయోగిస్తుంది. ఇది భారత్లోనే తయారు చేసిన బ్యాటరీ సెల్స్. ఓలా భారత్లో తన సొంత బ్యాటరీ సెల్స్ తయారు చేసిన మొదటి కంపెనీ అయింది.
ఓలా ఎలక్ట్రిక్ తన ప్రొడక్ట్ లైనప్ను విస్తరిస్తోంది. ఇటీవల ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ రోడ్స్టర్ X విడుదల చేసింది. ఇది పెర్ఫామెన్స్ కోరుకునే కస్టమర్లకు టార్గెట్. నాలుగు సంవత్సరాల క్రితం ఎలక్ట్రిక్ టూ-వీలర్ల తయారీ ప్రారంభించింది. గత ఏడాది 10 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్ల తయారీ పూర్తి చేసింది. ఈ మైల్స్టోన్ EV సెక్టార్లో ఓలా రాపిడ్ గ్రోత్ను చూపించింది.
Also Read: మీ ఫోన్లో ఓటీపీ మెసేజ్లు కనిపించడం లేదా? ఇలా చేయండి
అండర్పెర్ఫార్మింగ్ స్టోర్లు (సేల్స్ సరిగా లేని స్టోర్లు) మూసివేయడం ద్వారా ఆపరేషనల్ ఖర్చులు తగ్గుతాయి. హై-పెర్ఫార్మింగ్ లొకేషన్లపై దృష్టి పెడుతోంది. గ్రోత్తో పాటు సస్టైనబుల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లక్ష్యంగా ఉంది. భారత EV మార్కెట్ వేగంగా మారుతోంది. ప్రైసింగ్, సర్వీస్ క్వాలిటీ, టెక్నాలజీపై పోటీ ఉంది. కస్టమర్ ట్రస్ట్ పెంచడం, సర్వీస్ స్టాండర్డ్స్ మెరుగుపరచడం ముఖ్యం. రాబోయే నెలల్లో కంపెనీ బిజినెస్ ఎలా అడాప్ట్ అవుతుందో చూడాలి. కానీ పోటీ మరింత తీవ్రంగా ఉండనుంది.