E-Paper
Advertisement

ACB Raids: అమాయకుడిపై ఖాకీ ప్రతాపం.. కట్ చేస్తే సీన్ రివర్స్! ఏసీబీ వలలో సీఐ, ఎస్సై!

ACB Raids: అమాయకుడిపై ఖాకీ ప్రతాపం.. కట్ చేస్తే సీన్ రివర్స్! ఏసీబీ వలలో సీఐ, ఎస్సై!
Advertisement

ACB Raids:  కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై అనిల్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అనంతపురం పట్టణానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి నడుపుతున్న ఆటో కన్సల్టెన్సీ ద్వారా విక్రయించిన ఒక బైక్‌ను, బీహార్‌కు చెందిన దిలీప్ అనే నిందితుడు చైన్ స్నాచింగ్ నేరాలకు ఉపయోగించాడు. అయితే.. అసలు నిందితుడిని వదిలేసి.. బైక్ అమ్మిన బ్రహ్మంను కేసులో ఇరికిస్తామని పోలీసులు భయపెట్టారు. ఈ కేసు నుండి తప్పించడానికి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా.. చివరికి 2 లక్షలకు బేరం కుదిరింది.

ఏసీబీ ఎంట్రీ..

Advertisement

బాధితుడు బ్రహ్మం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పటికే ఎస్సై అనిల్‌కు 50 వేల రూపాయలు అందగా.. మిగిలిన మొత్తాన్ని తీసుకుంటుండగా అధికారులు ఆయన్ని పట్టుకున్నారు. విచారణలో.. తాను పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఆదేశాల మేరకే ఈ లంచం తీసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. దీంతో ఏసీబీ అధికారులు లింగాల నుండి పులివెందుల వెళ్తున్న సీఐ వెంకటరమణను మార్గ మధ్యలో అదుపులోకి తీసుకున్నారు.

సోదాల్లో విస్తుపోయే నిజాలు

Advertisement

అనంతరం పులివెందులలోని సీఐ వెంకటరమణ నివాసంలో ఏసీబీ సీఐ నాగరాజ్ ఆధ్వర్యంలో ముమ్మర సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 20 తులాల బంగారం, కీలక పత్రాలను అధికారులు గుర్తించారు.

ఒక ఆసక్తికర పరిణామంలో.. సోదాలు జరుగుతున్న సమయంలో సీఐ ఇంట్లోని బంగారం, నగదు , పత్రాలను ఒక బ్యాగులో సర్దుకుని బయటకు పారిపోవడానికి ప్రయత్నించిన హోంగార్డు ప్రసాద్ రెడ్డిని ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం హోంగార్డును కూడా విచారిస్తున్నారు. నేరస్తుడిని పట్టుకోవాల్సిన పోలీసులే.. అమాయకులను బెదిరించి వసూళ్లకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also Read: వికారాబాద్‌లో దారుణం.. ప్రాణ స్నేహితుడిని ముక్కలు ముక్కలుగా నరికి..

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×