Rajinikanth About Balakrishna(Latest News Updates): ఎన్టీఆర్ శత జయంతి వేడుక. విజయవాడలో గ్రాండ్ ఈవెంట్. సూపర్స్టార్ రజినీకాంత్ చీఫ్ గెస్ట్. వేదికపై చంద్రబాబు, బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో రజినీకాంత్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. బాలయ్య గురించి రజినీ చేసిన కామెంట్లకు పబ్లిక్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ రజినీ ఏమన్నారంటే…
“కంటిచూపుతోనే చంపేస్తాడు బాలయ్య. ఒక తన్నుతంతే జీపు 20 నుంచి 30 ఫీట్లు ఎగిరిపడుతుంది. ఇలాంటివి రజినీకాంత్, అమితాబ్, అమీర్ఖాన్, సల్మాన్, షారుక్.. ఇలా ఎవరు చేసినా జనం ఒప్పుకోరు. బాలయ్య చేస్తే మాత్రం ఒప్పుకుంటారు. దటీజ్ బాలయ్య అన్నారు రజినీకాంత్. ఆయన ఈ మాటలంటుంటే జనం నుంచి కేకలే కేక.
ప్రజలు ఎన్టీఆర్ను బాలయ్యలో చూస్తున్నారు.. ఎన్టీఆర్ యుగపురుషుడని.. అందుకే బాలయ్య ఏం చేసినా జనం ఆమోదిస్తున్నారని అన్నారు.
బాలకృష్ణ చాలా కోపిష్ఠి.. కానీ, మనసు మాత్రం ‘పాలు’ మాదిరి స్వచ్ఛమైనది.. అన్నారు రజినీకాంత్.
బాలయ్య గురించి బానే స్టడీ చేశారు కాబోలు సూపర్స్టార్. నందమూరి హీరో గురించి అన్నీ ఉన్నదున్నట్టు చెప్పారంటున్నారు ఫ్యాన్స్.