E-Paper
Advertisement

RGV Case Update: పోలీస్ స్టేషన్ మెట్లెక్కనున్న ఆర్జీవీ.. అరెస్ట్ తప్పదా? విచారణతో ముగింపా?

RGV Case Update: పోలీస్ స్టేషన్ మెట్లెక్కనున్న ఆర్జీవీ.. అరెస్ట్ తప్పదా? విచారణతో ముగింపా?
Advertisement

RGV Case Update: ఎట్టకేలకు వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తనపై నమోదైన కేసుకు సంబంధించి.. ఒంగోలు పోలీసుల ముందు రేపు హాజరు కానున్నారు. ఇప్పటికే ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు ఆర్జీవీ తన హాజరు గురించి సమాచారం ఇచ్చారు.

ప్రకాశం జిల్లా మద్దిపాడు లో గత ఏడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొలిసారిగా నోటీసులు జారీ చేయగా, విచారణకు హాజరయ్యేందుకు తనకు కాస్త సమయం కావాలని ఆర్జీవీ పోలీసులను కోరారు. ఆ తర్వాత మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ కు వచ్చి ఆర్జీవీ గృహం వద్ద మరోమారు నోటీసులను అందజేశారు.

Advertisement

ఇదే అంశానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో మరో మారు ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందించగా, విచారణకు తాను హాజరుకానున్నట్లు రాంగోపాల్ వర్మ పోలీసులకు సమాచారం అందించారు. రాంగోపాల్ వర్మ శుక్రవారం విచారణకు హాజరవుతున్నట్లు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు తెలిపారు. ఉదయం 10 నుండి 11 గంటల మధ్యలో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఫోటోలను రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే రేపు విచారణకు రాంగోపాల్ వర్మ హాజరుకానుండగా, పోలీసులు ప్రత్యేక ప్రశ్నావళిని సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: Male Loan Groups: పురుషుల పొదుపు సంఘం గ్రూప్స్.. ఈ రూల్స్ తెలుసుకోండి!

అయితే ఆర్జీవీ విచారణకు వాస్తవంగా వస్తున్నారా? విచారణలో ఎటువంటి ప్రశ్నలను ఎదుర్కోబోతున్నారు? వాటికి ఆర్జీవీ సమాధానం ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నలకు రేపు సమాధానం దొరుకుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద రాంగోపాల్ వర్మ ఒంగోలుకు రానున్నట్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తగిన బందోబస్తును సైతం ఏర్పాటు చేస్తున్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×