E-Paper
Advertisement

Red sandalwood smuggling : సినిమా స్టైల్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్.. టాస్క్ ఫోర్స్ పట్టేసిందిలా..!

Red sandalwood smuggling : సినిమా స్టైల్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్..  టాస్క్ ఫోర్స్ పట్టేసిందిలా..!
Advertisement

Red sandalwood smuggling : చిత్తూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్ల పై దాడులు చేశారు. సత్యవేడు మండలం ఇందిరా నగర్ సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్స్ ఎర్రచందనం గోడౌన్ లో తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలించారు.

లారీలో వేసుకొని వెళ్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు వారిని వెంబడించి పట్టుకున్నారు. నాలుగు టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 16 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

అందులో తమిళనాడుకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడు. స్మగ్లర్లు ఎర్రచందనం గోడౌన్ కాపలాదారులను బెదిరించి వారిని కట్టివేసి దొంగతనానికి పాల్పడ్డారు . తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగలు ఈ గోడౌన్ పై దాడులు చేస్తారని టాస్క్ ఫోర్స్ అధికారులకు ముందుగానే సమాచారం అందిందన్నారు.

టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారం రోజులుగా నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ దాడుల్లో దాదాపు 30 మంది టాస్క్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పగించామన్నారు. సత్యవేడుకు చెందిన స్థానిక పోలీస్ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారని తెలిపారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×