BigTV English

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..
This image has an empty alt attribute; its file name is 4f97b077257bc3754bf87d1aa6965739.jpg

Road Accident : రెండు వేరు వేరు ప్రమాదాలలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలోని 44 హైవే పై చోటుచేసుకుంది.


వివరాలోకి వెళ్తే.. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలోని 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రైస్ మిల్లు వద్ద బియ్యం పాలిష్ చేసుకుని ట్రాక్టర్ లో లోడ్ చేసి.. గుత్తి మండలం మాముడూరు గ్రామానికి వెళ్తున్నారు. బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఓ ప్రైవేట్ వోల్వో బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

అలాగే పామిడి పట్టణ శివారులో మరో ప్రమాదం జరిగింది. లారీని ఐచర్ వాహనం వెనక నుంచి ఢీకొట్టడంతో.. ఒకరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.


రెండు ప్రమాదాల్లో మృతి చెందిన వారిని గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన చిన్న తిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులు, వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related News

Ntr Vidya Lakshmi Scheme 2025: ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు.. ఒక్కొక్కరికి లక్ష

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Big Stories

×