E-Paper
Advertisement

Road accident on Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్

Road accident on Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్
Advertisement

Road accident on Tirumala Ghat road Two Died: తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీఎన్‌సీ చివరి మలుపు వద్ద బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

తిరుపతి నుంచి తిరుమలకు తమిళనాడుకు చెందిన ఓ దంపతులు బైక్ పై వెళ్తున్నారు. మార్గమధ్యలో జీఎన్‌సీ చివరి మలుపు వద్ద బైక్ స్కిడ్ అయింది. ఈ ఘటనలో ఆ బైక్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నేరుగా బస్సు కిందకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోవడంతో తీసేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. చివరికి క్రైన్ సహాయంతో బస్సు కింద ఇరుక్కున మృతదేహాలను బయటకు తీశారు.

Advertisement

Also Read: వైసీపీకి భారీ షాక్..పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అలాగే బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×