E-Paper
Advertisement

Platform Tickets: ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ టికెట్ల అమ్మకాలు బంద్, ఎందుకంటే?

Platform Tickets: ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ టికెట్ల అమ్మకాలు బంద్, ఎందుకంటే?
Advertisement

Railway Platform Tickets:

దీపావళి, ఛత్ పూజ లాంటి పెద్ద పండుగలు వస్తున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రయాణీకులు ఆహ్లాదకరంగా ప్రయాణించేలా కీలక చర్యలు తీసుకుంటుంది. రద్దీ రోజు రోజుకు పెరుగుతున్న వేళ ఈజీగా క్రౌడ్ కంట్రోల్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది.  అందులో భాగంగానే పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ టికెట్ల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.  ప్రయాణీకుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, స్టేషన్లలో రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నార్త్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.

ప్లాట్ ఫారమ్ టికెట్ల అమ్మకాల నిలిపివేత ఎప్పటి వరకు అంటే?

దీపావళి, ఛత్ పూజ పండుగల కారణంగా రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. భారీ దృష్టిలో ఉంచుకుని, అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 28 వరకు కొన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ టికెట్లను నిలిపివేస్తున్నట్లు నార్త్ రైల్వే వెల్లడించింది. ముఖ్యంగా న్యూఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, ఆనంద్ విహార్, ఘజియాబాద్ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ టికెట్లను 13 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

నార్త్ రైల్వే CPRO ఏమన్నారంటే?

Advertisement

పండుగ సీజన్ లో ప్రయాణీకుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, స్టేషన్లలో రద్దీని నివారించడానికి ప్లాట్ ఫారమ్ టికెట్ల అమ్మకాల నిలివేత నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. “సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు, మహిళా ప్రయాణీకులతో పాటు వచ్చే వ్యక్తులు ప్లాట్‌ ఫామ్ టికెట్ కోసం విచారణ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు” అని ఉపాధ్యాయ్ వివరించారు.

Read Also: రైల్వే ప్లాట్‌ ఫారమ్ మీద గర్భిణీకి ప్రసవం చేసిన యువకుడు, నెట్టింట వీడియో వైరల్!

పండుగ సీజన్ లో ప్రత్యేక రైళ్లు

Advertisement

పండుగ సీజన్ లో ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ఇండియన్ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దసరా, దీపావళి, ఛత్ పూజ సందర్భంగా 12 వేల రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా బీహార్, యూపీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా రైళ్లను నడుపుతుంది. దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. రద్దీకి అనుగుణంగా బెర్తుల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also: ఇండియన్ డైమండ్ క్రాసింగ్.. నాలుగు రైల్వే లైన్లు ఒకే చోట కలిసే ఈ అద్భుతం గురించి మీకు తెలుసా?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×