BigTV English
Advertisement

Sankranti Rush : సంక్రాంతి సందర్భంగా పెరిగిన రద్దీ.. ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

Sankranti Rush : సంక్రాంతి సందర్భంగా పెరిగిన రద్దీ.. ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

Sankranti Rush : సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాలలో నివసించే ఏపీ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైవేలపై వాహనాల సంఖ్య పెరిగి భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టోల్‌బూత్‌ల మధ్య ట్రాఫిక్‌ క్లియర్‌ చేయటం కోసం టోల్‌ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.


టోల్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి సందర్బంగా జాతీయ రహదారి హైవేలపై వాహనాల రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు టోల్ బూత్‌లను సిబ్బంది ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్‌ కొంత తగ్గింది.

సంక్రాంతి సందర్బంగా విజయవాడ బస్టాండ్‌ వద్ద ప్రయాణీకుల రద్దీ పెరిగింది. బస్టాండు ప్లాట్‌ఫాములు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు ప్రజలు చేరుకుంటున్నారు. జనాలతో రద్దీ పెరగటంతో ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.


హైదరాబాద్‌-విజయవాడ హైవేపై గల పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ సహా జిల్లాల నుంచి ఏపీకి జనం పోటెత్తి వెళ్తుండటంతో.. యాద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంది. టోల్‌ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ నెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సందర్భంగా సెలవులు ప్రకటించింది తెలంగాణ సర్కార్‌. పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి తమ సొంత ఊరి బాట పట్టారు జనం. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై గల పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ సూచనలిస్తున్నారు అధికారులు.

.

.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×