BigTV English

Tirumala: తిరుమలలో సర్వదర్శనం నిలిపివేత .. టిటిడి సిబ్బందితో భక్తులు వాగ్వాదం..

Tirumala:తిరుమల తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనంపై తీవ్ర గందరగోళం నెలకొంది.టికెట్లు లేకుండా శుక్రవారం సర్వ దర్శనం కి వచ్చిన భక్తులను తితిదే సిబ్బంది దర్మనానికి అనుమతించడంలేదు. దీంతో తితిదే అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు శనివారం ఉదయం నుండి భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2, నారాయణ గిరి షెడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

Tirumala: తిరుమలలో సర్వదర్శనం నిలిపివేత .. టిటిడి సిబ్బందితో భక్తులు వాగ్వాదం..
Tirumala latest news
Tirumala

Tirumala latest news(Andhra news today):

తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనంపై తీవ్ర గందరగోళం నెలకొంది. టికెట్లు లేకుండా శుక్రవారం సర్వ దర్శనం కి వచ్చిన భక్తులను టిటిడి సిబ్బంది అనుమతించడంలేదు. దీంతో టిటిడి అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు శనివారం ఉదయం నుండి భారీ సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణ గిరి షెడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.


భక్తులు భారీ సంఖ్యలో ఉండటంతో క్యూలైన్ లు అతిథి గృహం వరకు చేరుకున్నాయి. దీంతో వైకుంఠ దర్శనానికి ఇబ్బందులు కలుగుతాయని భావించి, టోకెన్లు లేని భక్తులను దర్శనానికి టిటిడి అధికారులు నిరాకరించారు. రేపటి సర్వదర్శనం టిక్కెట్లు ఉన్నవారిని సాయంత్రం క్యూలైన్లలోకి అనుమతి ఇస్తామని టిటిడి అధికారులు వెల్లడించారు.

తొలుత వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం టోకెన్లు లేకపోయినా.. సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తామని టిటిడి అధికారులు ప్రకటించారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో సర్వదర్శనం కోసం బారులు తీరారు. భక్తులు భారీసంఖ్యలో ఉండటంతో కేవలం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని మరో ప్రకటన చేసింది టిటిడి. దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు రావడంతో రాత్రి నుంచే టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టారు టిటిడి సిబ్బంది. వైకుంఠ ఏకాదశి , ద్వాదశి రోజుల్లో దర్శనానికి వచ్చే భక్తులకు జారీ చేసిన టికెట్లను ప్రత్యేక రంగుల్లో ముద్రించారు.


రూ.300 ప్రత్యేక దర్మనం టికెట్లను టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి కావడంతో.. వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వీఐపీలకు వసతి గదులు కేటాయించలేక టిటిడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తితిది అధికారులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు వాపోయారు.

Tags

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×