E-Paper
Advertisement

Cyber Crime: ఫేస్‌బుక్ ఎంత పని చేసింది భయ్యా.. అక్షరాల రూ.20 లక్షలు గోవిందా..!

Cyber Crime: ఫేస్‌బుక్ ఎంత పని చేసింది భయ్యా.. అక్షరాల రూ.20 లక్షలు గోవిందా..!
Advertisement

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన ఓ బంగారం వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. వ్యాపారికి ‘రుచి’ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించడంతో ఈ వ్యవహారం మొదలైంది. గుర్తు తెలియని ఆ యువతి కొన్ని రోజులు వ్యాపారితో ఛాటింగ్ చేస్తూ పరిచయాన్ని పెంచుకుంది.

చాటింగ్ ద్వారా నమ్మకాన్ని చూరగొన్న తర్వాత, ఆ యువతి వ్యాపారిని మోసగించేందుకు పన్నాగం రచించింది. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే బంగారం, వెండిని పంపిస్తానని నమ్మబలికింది. ఆమె మాటలను పూర్తిగా నమ్మిన ఆ బంగారం వ్యాపారి, ఆమె చెప్పిన అకౌంట్‌కు దఫదఫాలుగా మొత్తం రూ. 20 లక్షలు పంపించాడు.

Advertisement

అయితే, డబ్బు పంపిన తర్వాత చాలా రోజులైనా సరుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారి ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె నుంచి ఎటువంటి స్పందనా లభించకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సైబర్ నేరగాళ్లపై దర్యాప్తు ప్రారంభించారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×