గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పు కోసం తపించే యువతకు ‘యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ ఒక అద్భుతమైన అవకాశం. ఎస్బీఐ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కొత్త బ్యాచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగస్వాములు కావాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలతో (NGOలు) కలిసి 13 నెలల పాటు క్షేత్రస్థాయిలో పని చేయాల్సి ఉంటుంది.
విద్యార్హత, వయస్సు వివరాలు
ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు గ్రామీణ సమస్యలపై లోతైన అవగాహన కల్పిస్తుంది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత కలిగిన వారు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. యువతకు సామాజిక సేవా రంగంలో ఆసక్తి ఉండటంతో పాటు గ్రామీణ పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వం ఉండాలి.
రూ.1.1 లక్షల గ్రాంట్, నెలకు రూ.21,000
ఆర్థిక ప్రయోజనాల విషయానికొస్తే.. ఫెలోషిప్ కాలంలో ఎంపికైన వారికి నెలకు రూ.21,000 అలవెన్స్ అందిస్తారు. దీనితో పాటు స్థానిక రవాణా ఖర్చుల కోసం అదనపు మొత్తం కేటాయిస్తారు. 13 నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు రూ.1,10,000 సర్దుబాటు గ్రాంట్ను ఒకేసారి అందజేస్తారు. ఇది యువత తమ భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవడానికి తోడ్పడుతుంది.
చివరి తేది ఇదే..
ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. ఆన్లైన్ అసెస్మెంట్ ద్వారా అభ్యర్థుల ప్రాథమిక నైపుణ్యాలను పరీక్షిస్తారు. అందులో మెరిట్ సాధించిన వారిని వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గల వారు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
అప్లికేషన్ లింక్: https://youthforindia.org
ALSO READ: Ms Dhoni-Gambhir: గంభీర్ కు భార్య నటాషా వెన్నుపోటు..ధోనితో రొమాంటిక్ ఫోటోలు !