Ms Dhoni-Gambhir: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విశ్వ విజేతగా టీమిండియా నిలిచింది. ఇప్పటికే మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో 2007లో టి20 ప్రపంచ కప్ మొట్టమొదటిసారిగా టీమిండియా కైవసం చేసుకుంది. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024 లో రెండో టి20 ప్రపంచ కప్ ఇండియాకు దక్కింది. ఇక ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ముచ్చటగా మూడవసారి కూడా టీం ఇండియాకు టైటిల్ దక్కింది. దీంతో భారత దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోనితో గంభీర్ సతీమని నటాషా ఫోటోలు దిగడం వివాదంగా మారింది.
Also Read: Pak On Team India: అంతా ఫిక్సింగే..టీమిండియా విజయం వెనుక అమిత్ షా, ధోని, రోహిత్ కుట్రలు ?
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడ్డాయి. అయితే ఈ టోర్నమెంట్ ఫైనల్ నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అలాగే రోహిత్ శర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ మ్యాచ్ కు వచ్చారు. ధోని వస్తే స్టేడియం మొత్తం ఎంత అలర్ట్ అవుతుందో అందరికీ తెలిసిందే. అతని చూసేందుకు జనాలు ఇవ్వబడుతూ ఉంటారు. సెల్ఫీలు కూడా దిగుతూ ఉంటారు. స్టేడియం కెమెరామెన్లు అయితే.. అమ్మాయిలను చూపించకుండా, కేవలం మహేంద్ర సింగ్ ధోని ముఖంపైనే కెమెరాలు పెడుతూ ఉంటారు.
అయితే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఫైనల్ రోజు ధోని వచ్చిన సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సతీమణి నటాషా ( Natasha Jain ) చేసిన పని ఆసక్తికరంగా మారింది. ధోని కూర్చున్న విఐపి గ్యాలరీకి వెళ్లి… గంభీర్ సతీమణి నటాషా ఫోటోలు దిగారు. ఆమె దిగడమే కాకుండా తన పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ధోనితో ఫోటోలు దిగి రచ్చ చేశారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. దీనిపై గౌతమ్ గంభీర్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తన పర్మిషన్ లేకుండా ధోనితో ఎందుకు ఫోటోలు దిగారని గంభీర్ చాలా సీరియస్ అయ్యాడట. దీంతో గంభీర్ సతీమని కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన ధోని ఫ్యాన్స్, గంభీర్ ను ఆడుకుంటున్నారు. గంభీర్ కు ఆయన భార్య నటాషా వెన్నుపోటు పొడిచిందని అంటున్నారు.
2011 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఫైనల్ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ ఓపెనర్ గా బరిలోకి దిగి 97 పరుగులు చేశాడు. కానీ అతని తరువాత వచ్చిన ధోని కూడా 90 కి పైగా పరుగులు చేసి చివరలో సిక్సర్ కొట్టాడు. దీంతో ధోనీనే వన్డే వరల్డ్ కప్ తీసుకువచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇక అప్పటినుంచి ధోని అంటే గౌతమ్ గంభీర్ కు అస్సలు పడడం లేదు. తన క్రెడిట్ మొత్తం ధోని తీసుకున్నాడని చాలాసార్లు మీడియా ముందు చెప్పాడు గంభీర్.
Also Read: Sahibzada Farhan: ఐసీసీని కోర్టుకు ఈడ్చుతా..నాకు దక్కాల్సిన అవార్డ్, సంజుకు ఎలా ఇస్తారు ?
?utm_source=ig_web_copy_link