E-Paper
Advertisement

AP : రేపటి నుంచి బడులు.. అప్పటి వరకు ఒంటి పూటే క్లాసులు..

AP : రేపటి నుంచి బడులు.. అప్పటి వరకు ఒంటి పూటే క్లాసులు..
Advertisement

Andhra Pradesh today news : ఏపీలో వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచేస్తున్నాయి. గరిష్ట ఉష్టోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు పొడిగించాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కానీ ప్రభుత్వం పాఠశాలలను యథాప్రకారమే తెరచేందుకు మొగ్గు చూపింది.

Advertisement

సెలవులు పొడిగించడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం నేపథ్యంలో ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17 వరకు ఒక పూట బడులు పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని సర్కార్ ఆదేశాలిచ్చింది.ఇలా సెలవులు పొడిగించకుండా ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ నెల 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×