E-Paper
Advertisement

AP : రేపటి నుంచి బడులు.. అప్పటి వరకు ఒంటి పూటే క్లాసులు..

AP : రేపటి నుంచి బడులు.. అప్పటి వరకు ఒంటి పూటే క్లాసులు..

Andhra Pradesh today news : ఏపీలో వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచేస్తున్నాయి. గరిష్ట ఉష్టోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు పొడిగించాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కానీ ప్రభుత్వం పాఠశాలలను యథాప్రకారమే తెరచేందుకు మొగ్గు చూపింది.

సెలవులు పొడిగించడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం నేపథ్యంలో ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17 వరకు ఒక పూట బడులు పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని సర్కార్ ఆదేశాలిచ్చింది.ఇలా సెలవులు పొడిగించకుండా ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ నెల 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×