BigTV English
Advertisement

AP: ఏపీలో అద్భుత దృశ్యం.. భారీగా ఎగబడి చూస్తున్న జనాలు

AP: ఏపీలో అద్భుత దృశ్యం.. భారీగా ఎగబడి చూస్తున్న జనాలు

Srisailam Dam gates opened: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద ఉధృతి కారణంగా నీటి మట్టం పెరగడంతో అధికారులు జలాశయం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గేట్ల నుంచి కృష్ణమ్మ బిరా బిరా మంటూ కిందకు పరుగులు పెడుతున్నది. ఈ దృశ్యాలను జనాలు చూస్తూ సంబురపడుతున్నారు. ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లను వీడియో తీసుకుంటున్నారు.


అయితే, ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ, తుంగభద్ర నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా మారింది. జలాశయం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. నీటిమట్టం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 180 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం జలాశయానికి భారీగా వరద నీరు వస్తున్నది. 4.67 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో గంట గంటకు ప్రాజెక్టులోని నీటి మట్టం పెరగడం, గంటకు ఒక టీఎంసీ చొప్పున డ్యాంకు నీరు వచ్చి చేరుతుండడంతో ఏ క్షణమైనా జలాశయ నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ముందస్తుగా ఎగువ నారాయణ పూర్, అలమట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహంతోపాటు ఇటు తుంగభద్ర జలాశయం, సుంకేసుల బ్యారేజ్ నుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని లెక్క కట్టిన అధికారులు కనిష్ఠ స్థాయిలో శ్రీశైలం జలాశయంలో నీటిని నిలువ చేశారు.

Also Read: ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం..


ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు సాయంత్రం 4 గంటలకు అధికారులు శ్రీశైలం జలాశయం మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల వరకు నీరు విడుదలవుతుందని అధికారులు చెబుతున్నారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×