E-Paper
Advertisement

Amaravati: అమరావతి కేసులో జగన్‌కు షాక్.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Amaravati: అమరావతి కేసులో జగన్‌కు షాక్.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..
Advertisement

Amaravati: అమరావతిపై ఏపీ సర్కారు ముందడుగు వేయడం లేదు. రాజధాని రైతులు పట్టు వీడటం లేదు. మూడు రాజధానులు వద్దు.. అమరావతినే ముద్దు.. అంటూ స్థానికులు హైకోర్టుకు వెళ్లారు. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. తాజాగా అక్కడా చుక్కెదురైంది.

అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా.. స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. కేసు విచారణ వీలైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేయగా.. సుప్రీంకోర్టు సున్నితంగా తిరస్కరించింది. ఈ కేసులో అనేక మంది ప్రతివాదులు ఉన్నారని.. వారందరి వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. తాము ఇతర కేసులు కూడా విచారించాల్సి ఉందంటూ ఒకింత ఘాటుగానే స్పందించింది.

Advertisement

కనీసం వచ్చే నెలలోనైనా విచారణ జరపాలని ఏపీ తరఫు న్యాయవాదులు అభ్యర్థించగా.. కేసును జులై 11కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×