E-Paper
Advertisement

Palnadu Crime: సుప్రీంకోర్టు ఆదేశాలు.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్, నెక్ట్స్ ఏంటి?

Palnadu Crime:  సుప్రీంకోర్టు ఆదేశాలు..  కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్, నెక్ట్స్ ఏంటి?
Advertisement

Palnadu Crime: జంట హత్య కేసులో ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A-6, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి A-7 నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో వారి తల్లి రాములమ్మ, సోదరి నాగమణి కన్నీరు మున్నీరు అయ్యారు.

కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్

Advertisement

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం స్థానిక న్యాయస్థానంలో లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు ఈ ఏడాది మే 24న హత్యకు గురయ్యారు.

Advertisement

గ్రామంలో ఆధిపత్య పోరును అనుకూలంగా మలచుకొని జంట హత్యలకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఈ కేసులో పిన్నెల్లి సోదరులను ఏ6, ఏ7గా చేర్చి కేసు నమోదు చేశారు  పోలీసులు. ఈ కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్‌‌ను హైకోర్టు రద్దు చేసింది.  ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

14 రోజులు రిమాండ్ విధించిన మాచర్ల న్యాయస్థానం

చివరకు అక్కడా బెయిల్‌ పిటిషన్‌ రద్దైంది. రెండు వారాల్లో లొంగిపోవాలని పోయినవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు గురువారం కోర్టులో లొంగిపోయారు. మాచర్లలోని జూనియర్‌ అదనపు సివిల్‌ జడ్జి కోర్టుకు పిన్నెల్లి బ్రదర్స్ వచ్చారు. నేతలు న్యాయస్థానానికి హాజరైన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోస్తు ఏర్పాటు చేశారు. గతరాత్రి నుంచి 144 సెక్షన్ విధించారు. 

వైసీపీ నేతలు కోర్టుకి వెళ్లకుండా వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. న్యాయస్థానం పిన్నెల్లి సోదరులకు 14 రోజులు రిమాండ్ విధించింది. మాచర్ల నుంచి నెల్లూరు జైలుకి వీరిని తరలించారు.  ఈ కేసులో రేపో మాపో వీరిద్దరిని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.  

ALSO READ: బోరుగడ్డకు షాకిచ్చిన వైసీపీ

Related News

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఆయన-కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

Big Stories

Advertisement
×