Palnadu Crime: జంట హత్య కేసులో ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A-6, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి A-7 నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో వారి తల్లి రాములమ్మ, సోదరి నాగమణి కన్నీరు మున్నీరు అయ్యారు.
కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం స్థానిక న్యాయస్థానంలో లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు ఈ ఏడాది మే 24న హత్యకు గురయ్యారు.
గ్రామంలో ఆధిపత్య పోరును అనుకూలంగా మలచుకొని జంట హత్యలకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఈ కేసులో పిన్నెల్లి సోదరులను ఏ6, ఏ7గా చేర్చి కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
14 రోజులు రిమాండ్ విధించిన మాచర్ల న్యాయస్థానం
చివరకు అక్కడా బెయిల్ పిటిషన్ రద్దైంది. రెండు వారాల్లో లొంగిపోవాలని పోయినవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు గురువారం కోర్టులో లొంగిపోయారు. మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు పిన్నెల్లి బ్రదర్స్ వచ్చారు. నేతలు న్యాయస్థానానికి హాజరైన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోస్తు ఏర్పాటు చేశారు. గతరాత్రి నుంచి 144 సెక్షన్ విధించారు.
వైసీపీ నేతలు కోర్టుకి వెళ్లకుండా వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. న్యాయస్థానం పిన్నెల్లి సోదరులకు 14 రోజులు రిమాండ్ విధించింది. మాచర్ల నుంచి నెల్లూరు జైలుకి వీరిని తరలించారు. ఈ కేసులో రేపో మాపో వీరిద్దరిని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
ALSO READ: బోరుగడ్డకు షాకిచ్చిన వైసీపీ
మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి
జంట హత్యకేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు
రెండు వారాల్లో… https://t.co/hPypjfLD9h pic.twitter.com/m52KCjhrCv
— BIG TV Breaking News (@bigtvtelugu) December 11, 2025