కొందరికి మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఒకటి మాట్లాడుతుంటారు. లోపల అజెండా వేరుగా ఉంటుంది. బయట మరోలా కనిపిస్తుంటారు. ఇలాంటివి ఇక కాంగ్రెస్ లో చెల్లవని కొండా సురేఖ ఎపిసోడ్ తో హైకమాండ్ తేల్చేసింది. ఏకంగా మంత్రివర్గం నుంచి బరర్తఫ్ దాకా మ్యాటర్ వెళ్లింది. రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాటిని అలాగే డీల్ చేయాలి. కొండా సురేఖ విషయమే తీసుకుంటే.. ఎంతో కాంపిటీషన్ ఉన్నప్పటికీ క్యాబినెట్ లో బెర్త్ దొరికింది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి. కానీ అలా జరగలేదు. గతంలో ఓఎస్డీ విషయంలో విమర్శలు వచ్చాయ్. వీటికి తోడు సురేఖ కూతురు వ్యవహారం పదవికే ఎసరు తెచ్చి పెట్టింది.
కూతురి కామెంట్లతో సంబంధం లేదు అని సింపుల్ గా చెబితే సరిపోతుందా? ప్రతిపక్షాలను కార్నర్ చేయాల్సిన చోట ఏకంగా సీఎంనే విమర్శిస్తే ఎలా..? ఒకసారి కాదు ఇది రెండోసారి కొండా సుస్మిత సీఎంను టార్గెట్ చేసి మాట్లాడారు. తొలిసారి ఇలా ఘాటు విమర్శలు చేసినప్పుడు.. కొండా సురేఖ సీన్ లోకి వచ్చి మా కుమార్తె ఏదో ఆవేశంలో మాట్లాడింది.
పోలీసులు ఇంటికి రావడంతో జరిగిన పరిణామాల వల్ల ఆందోళన చెంది సీఎం రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు బదులుగా తాను ముఖ్యమంత్రికి క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఆ మాటతో అప్పుడు వివాదానికి పుల్ స్టాప్ పడింది. కానీ సుస్మిత రెండోసారి కూడా అంతకంటే ఘాటుగా మాట్లాడారు. ముఖ్యమంత్రి అయితే కళ్లు నెత్తికెక్కాయా అని క్వశ్చన్ చేశారు. ఇలాంటప్పుడు కూడా క్షమిస్తే పార్టీలో, ప్రజల్లో అదే నెగెటివ్ ఇమేజ్ వెళ్లదా? అందుకే ఈ బర్తరఫ్ అన్న సిగ్నల్స్ ను హైకమాండ్ ఇచ్చింది.