E-Paper
Advertisement

CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు

CM Revanth Delhi Tour: ఢిల్లీలో సీఎం.. గ్లోబల్ సమ్మీట్ సక్సెస్‌పై సోనియా, రాహుల్ ప్రశంసలు
Advertisement

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ విజ‌యవంత‌మైన తీరు, తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ‌పై వారి మ‌ధ్య చ‌ర్చ కొన‌సాగింది. స‌మ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు ఒప్పందాలు చేసుకోవ‌డంపై అగ్ర నేత‌లు సీఎంను ప్ర‌శంసించారు.

Advertisement

ఈ భేటీలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. అలాగే, ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను కూడా కాంగ్రెస్ అగ్రనేతలకు వివరించారు.

ఖర్గేతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్‌కు చేరారు. పార్లమెంట్‌లో వారు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై, రాష్ట్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.

Advertisement

సమగ్రంగా, తెలంగాణ ప్రభుత్వ పనితీరు, రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వతో సన్నిహిత సంబంధాలను పటిష్టం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ఘ‌నంగా నిర్వ‌హించ‌బడిన నేపథ్యంలో రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల పైగా పెట్టుబ‌డులు క‌ట్టేందుకు వివిధ సంస్థ‌లు ముందుకొచ్చాయి. ఈ విజయం పై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పార్ల‌మెంట్‌లో పోరిక బ‌ల‌రాం నాయ‌క్, సురేష్ షెట్కార్, డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ఎం. అనిల్ కుమార్‌ అభినంద‌న‌లు తెలిపారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×