E-Paper
Advertisement

Swami Swaroopananda Comments: చంద్రబాబు గెలవాలని పూజలు చేశా.. అందుకే..!!

Swami Swaroopananda Comments: చంద్రబాబు గెలవాలని పూజలు చేశా.. అందుకే..!!
Advertisement

Swami Swaroopananda Comments on Chandrababu Victory: చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం బలమైందని తెలిపారు. చంద్రబాబు ప్రజలకు మేలు కలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని అన్నారు. కేంద్రంలో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నామని తెలిపారు.

అమరావతిలో కూడా శారదాపీఠం నిర్మిస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశిస్సులు ఉంటాయని చెప్పారు. త్వరలోనే చాతుర్యాస పూజల కోసం రుషికేశ్ వెళ్తున్నాం.. అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నామని వెల్లడించారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కావడం సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

అమ్మవారి కృపతో మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందం కలిగించిందన్నారు. చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దన్న ఆయన.. చంద్రబాబు గెలుపు కోసం గతంలో మురళిమోహన్‌తో కలిసి సాధువులందరితో సమావేశం పెట్టి పూజలు చేశాం అని తెలిపారు. చతుర్మాస దీక్ష అనంతరం హైదరాబాద్‌లోని శారదాపీఠంలో స్థిరపడాలని అనుకుంటున్నట్లు చెప్పారు

Also Read: రాజీపడే ప్రసక్తే లేదు.. చట్టానికి లోబడే మీకు గట్టిగా బుద్ధి చెబుతాం: పట్టాభిరామ్

Advertisement

తనపై, శారదాపీఠంపై తప్పుడు అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండాలని మీడియాకు తెలిపారు. తనకు చంద్రబాబు అంటే గౌరవం అని చెప్పారు. చంద్రబాబు చాలా సీనియర్ నేత అని.. మరి కొన్ని కాలాలపాటు ఆయురారోగ్యాలతో చంద్రబాబు బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సారైనా దేవాలయాల పాలన బాగుండేలా చూడాలని తెలిపారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×