BigTV English

Suresh Gopi Denies Reports: అవన్నీ తప్పుడు వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సురేష్ గోపీ..

Suresh Gopi Denies Reports: అవన్నీ తప్పుడు వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సురేష్ గోపీ..

Suresh Gopi Denies Reports of Quitting Union Ministry: ప్రధాని మోదీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో భాగం కావడం తనకు ఇష్టం లేదని, తన మంత్రి పదవి నుంచి తప్పించుకోవాలని భావిస్తున్నట్లు వచ్చిన వార్తలను త్రిస్సూర్ బీజేపీ ఎంపీ సురేష్ గోపీ ఖండించారు. సోషల్ మీడియా వేదికగా తను ఆ వార్తలను కొట్టిపారేశారు.


“మోదీ ప్రభుత్వ మంత్రిమండలికి నేను రాజీనామా చేయబోతున్నానని కొన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇది చాలా తప్పు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాము” అని సురేష్ గోపీ ట్వీట్ చేశారు.

ఆదివారం మోదీ 3.0 ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత, సురేష్ గోపి మంత్రి పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.


తనకు పదవి నుంచి విముక్తి పొందాలని.. త్రిస్సూర్ ప్రజల కోసం ఎంపీగా పనిచేయాలని.. అలాగే సినిమాలను ఒప్పుకున్నానని వాటిని ఎలాగైనా చేయవలసి ఉంటుందని సురేష్ గోపీ నివేదించినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి.

Also Read: 7th Pay Commission DA Hike News: ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో డీఏ పెంపు..!

‘‘ఎంపీగా పనిచేయడమే నా లక్ష్యం.. నేనేమీ అడగలేదు.. నాకు ఈ పదవి అవసరం లేదని చెప్పాను.. త్వరలోనే ఆ పదవి నుంచి రిలీవ్ అవుతానని అనుకుంటున్నా.. త్రిసూర్ ఓటర్లతో ఎలాంటి ఇబ్బంది లేదు. వారికి తెలుసు, ఎంపీగా నేను వారి కోసం ఎంతైనా మంచి ప్రదర్శన ఇస్తాను, నేను నా సినిమాలను ఎలాగైనా తీయాలి” అని ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఢిల్లీలో ఒక ప్రాంతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ సురేష్ గోపి అన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

 

 

అయితే, గోపీ ఆఫీస్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. సురేష్ గోపీ ఈ విధంగా చెప్పలేదని.. వాస్తవానికి, మీడియాలోని ఒక నిర్దిష్ట వర్గం ద్వారా అపోహలు వ్యాప్తి చెందుతాయని పేర్కొంది. పోర్ట్‌ఫోలియో కేటాయింపు తర్వాత సురేశ్ గోపీ స్పష్టత ఇస్తారని తెలిపింది.

Also Read: మోదీ కేబినెట్ భేటీ, శాఖల కేటాయింపు.. కీలక సూచనలు

గోపీ, బీజేపీ సీనియర్ నాయకుడు జార్జ్ కురియన్, కేరళ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాందించారు. వామపక్షాలకు కంచుకోటగా ఉన్న త్రిసూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సురేష్ గోపీ విజయం సాధించి కేరళ నుంచి తొలి బీజేపీ ఎంపీగా చరిత్ర సృష్టించారు. త్రిముఖ పోరులో సీపీఐ అభ్యర్థి వీఎస్ సునీల్ కుమార్‌పై సురేశ్ గోపీ 74 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. త్రిసూర్ లోక్‌సభ స్థానం నుంచి కే మురళీధరన్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దింపింది.

Tags

Related News

Pakistan Prime Minister: భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. మోడీ స్కెచ్ ఏంటి?

Chennai News: పార్టీ తరపున మృతులకు 20 లక్షలు.. టీవీకే నేతలపై కేసులు, విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత

Karur stampede updates: విజయ్ అరెస్టు తప్పదా? పెరుగుతోన్న మృతులు, విచారణకు ఏకసభ్య కమిషన్

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Big Stories

×