E-Paper
Advertisement

Taneti Vanitha: బాలయ్య సినిమా అప్పుడు 20 పొట్టేళ్లు నరికితే కనపడలేదా?: మాజీ మంత్రి తానేటి వనిత ఫైర్

Taneti Vanitha: బాలయ్య సినిమా అప్పుడు 20 పొట్టేళ్లు నరికితే కనపడలేదా?: మాజీ మంత్రి తానేటి వనిత ఫైర్
Advertisement

Taneti Vanitha: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ప్లెక్సీలపై సినిమా డైలాగులు రాస్తే కేసులు పెట్టడం, నల్లజర్లలో కార్యకర్తను నడిరోడ్డుపై నడిపించడం వంటి చర్యలు దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

రక్త తర్పణం చేసిన వారిని ఊరి నుంచి బహిష్కరించాలని హోంమంత్రి అనిత అంటున్నారని, మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజున థియేటర్ల వద్ద 20 పొట్టేళ్ల తలలు నరికి దండలు కట్టినప్పుడు హోంమంత్రికి అది జీవహింసలా, రాక్షస సంస్కృతిలా కనిపించలేదా అని వనిత సూటిగా ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతిని ప్రవేశపెట్టిందే టీడీపీ అని, ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ ప్లెక్సీలకు టీడీపీ కార్యకర్తలు రక్తంతో తర్పణం చేసినప్పుడు హోంమంత్రి కళ్లు మూసుకున్నారా అని నిలదీశారు.

Advertisement

మా వాళ్లకు పోలీసులతో ‘ట్రీట్మెంట్’ ఇప్పిస్తానంటూ హోంమంత్రి మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారం, చట్టాన్ని చేతిలోకి తీసుకునే అర్హత పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జగన్‌ను దూషిస్తేనే మంత్రి పదవి ఉంటుందని అనిత భావిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆమెకు పట్టడం లేదని విమర్శించారు.

రాజధాని రైతులు మోసపోయామని గ్రహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కూటమి నేతలు ‘జీవహింస’ అంటూ డ్రామాలు ఆడుతున్నారని వనిత ఆరోపించారు. ప్రభుత్వం ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, జరుగుతున్న దాడులన్నింటినీ ‘డిజిటల్ బుక్’లో నమోదు చేయాలని సూచించారు. తాము అధికారంలోకి వచ్చాక బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Read Also:Bhatti Vikramarka: దేశానికే దిక్సూచి కాంగ్రెస్.. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: డిప్యూటీ సీఎం భట్టి

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×