BigTV English
Advertisement

Supreme Court Order: కర్ర పోయి కత్తి వచ్చే? తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ-వైసీపీ రియాక్షన్స్ ఇవే!

Supreme Court Order: కర్ర పోయి కత్తి వచ్చే? తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ-వైసీపీ రియాక్షన్స్ ఇవే!

Tdp and Ysrcp reaction: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎవరు సేఫ్? అధికార టీడీపీకి అనుకూలమా? వైసీపీకి అనుకూలమా? అధికార పార్టీ కంటే.. వైసీపీకి ఇబ్బందులు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు విచారణ సంస్థ ముందు మాజీ టీటీడీ ఛైర్మన్లు, మాజీ ఈవో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.


తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయంపై సీఎం చంద్రబాబు తర్జన భర్జన పడ్డారు. తొలుత డిపార్టుమెంట్ విచారణ ఆదేశించారు. అందులో నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. గుజరాత్ ల్యాబ్‌కు నెయ్యిని తరలించారు. అక్కడా జంతువుల కొవ్వు కలిసిందని తేలింది. సెప్టెంబర్ 18న కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు స్టేట్‌మెంట్ ఇచ్చారు.

లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు.. కేంద్రప్రభుత్వంతో మాట్లాడినట్టు అంతర్గత సమాచారం. తిరుమల లడ్డూ విషయాన్ని ఏం చేద్దామని అడిగారట. సీబీఐ ఎంక్వైరీ అయితే బాగుంటుందని సీఎం అన్నట్లు తెలుస్తోంది. తొలుత సిట్ వేసి దర్యాప్తు చేయించాలని సలహా ఇవ్వడంతో అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కూటమి సర్కార్.


తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో అధికార టీడీపీ రియాక్ట్ అయ్యింది. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా సీరియస్ అంశమని టీడీపీ సోషల్ మీడియా విభాగం రాసుకొచ్చింది. ఈ లెక్కన జగన్, ఆయన టీమ్ పాపం పండినట్టేనని ప్రస్తావించింది.

ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. సత్యమేవ జయతే.. ఓం నమో వేంకటేశాయ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

ALSO READ: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్వతంత్ర దర్యాప్తు, కాకపోతే

వైసీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యింది. లడ్డూ వ్యవహారాన్ని సిట్‌తో చుట్టేయాలని చూసిన చంద్రబాబు సర్కార్‌కు సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని పేర్కొంది. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు పచ్చజెండా ఊపిందని తెలిపింది. సుప్రీంకోర్టు సిట్‌తో కూటమి ప్రభుత్వం బిక్కమొహం పెట్టుకుందని రాసుకొచ్చింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో టీటీడీ మాజీ ఛైర్మన్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై దర్యాప్తు లేకుండా చేస్తుందని తాము భావించామని, ఏపీ సిట్ పోయి.. దాని స్థానంలోకి సీబీఐ వచ్చిందని అంటున్నారు. ఈ లెక్కన విచారణకు తాము హాజరుకావాల్సిన అవసరం ఏర్పడిందన్నది ఆయా నేతల మాట.

లడ్డూ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆయన ఎక్కడా సీబీఐ గానీ, న్యాయ విచారణ గానీ కోరలేదు. పైగా తమ ప్రభుత్వంలో కేంద్రానికి చెందినవారు టీటీడీ సభ్యులుగా ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై మాజీ సీఎం జగన్ మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. ఆ సమావేశంలో ఆయన ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.

 

Related News

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

Big Stories

×