E-Paper
Advertisement

TDP Petition on Janasena Symbol: గాజు గ్లాసుపై కోర్టుకు టీడీపీ.. మళ్లీ ఏమైంది…?

TDP Petition on Janasena Symbol: గాజు గ్లాసుపై కోర్టుకు టీడీపీ.. మళ్లీ ఏమైంది…?
Advertisement

TDP Petition on Janasena Symbol: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రతీ దశలోనూ కూటమి అభ్యర్థులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జనసేన గాజు గ్లాసు గుర్తుపై న్యాయస్థానానికి వెళ్లింది తెలుగుదేశం పార్టీ.

జనసేన పార్టీ గుర్తుపై ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు కూటమి అభ్యర్థులను మరింత గందరగోళం లోకి నెట్టిందని ఆరోపించింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్నాయని, గాజు గ్లాసు గుర్తును మిగతా నియోజకవర్గాల్లో వేరే అభ్యర్థులకు కేటాయించరాదని పిటీషన్‌ వేసింది తెలుగుదేశం పార్టీ.

Advertisement

ముఖ్యంగా జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు సింబల్‌ను అన్ని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లలో ఇతరులెవరికీ కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని అత్యవసరంగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. గాజు గ్లాసు గుర్తును కేవలం జనసేనకు రిజర్వు చేయాలన్నది అందులోని ప్రధాన పాయింట్. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరారు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు ఓటర్లను మరింత అయోమయానికి గురిచేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది.

Also Read: అడ్డంగా దొరికిన టెక్కలి వైసీపీ అభ్యర్థి, దువ్వాడా.. మజాకా?

Advertisement

జనసేన పార్టీ పోటీ చేసే రెండు ఎంపీ స్థానాలతోపాటు 21 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు తెలిపింది. ఈ నిర్ణయంతో జనసేన‌కు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొంది. మిగతా నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తే కూటమి అభ్యర్థులపై ప్రభావం చూపుతుందన్నది టీడీపీ వాదన. మరి న్యాయస్థానం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తుందో చూడాలి.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×