BigTV English
Advertisement

Perni Nani: పిన్నెల్లి హత్యకు కుట్ర..పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani: పిన్నెల్లి హత్యకు కుట్ర..పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani Sensational Comments On TDP: మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లిని హత్య చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అధికారులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని అన్నారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే అధికారులు కూడా వారినే నియమించారని తెలిపారు. ఏపీలో అనేక ప్రాంతాల్లో అల్లర్లు జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదని మండిపడ్డారు.


వైసీపీ నేతలు ఏక పక్షంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదని అన్నారు. పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేయలేదని ఈ నెల 15న ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. మరి 13వ తేదీన ఎందుకు ఫిర్యాదు చేయలేదని టీడీపీని ప్రశ్నించారు. సిట్ అధికారులు డీజీపీకి ఇచ్చిన నివేదికలో కూడా పిన్నెల్లి ప్రస్తావన లేదన్నారు. పిన్నెల్లిపై ఈసీ దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు.

ఈ నెల 12న ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించిందని చెప్పారు. పోలింగ్ ఆగినట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ బుక్ లో ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వివిధ ఛానాళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా అని అన్నారు. నిజంగానే ఎమ్మెల్యే ఈవీఎంలు ధ్వంసం చేస్తే వారు ఈసీ అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు.


Also Read: చీఫ్ సెక్రటరీ కాదు.. చీప్ సెక్రటరీ : సీఎస్ పై సోమిరెడ్డి ఫైర్

టీడీపీ నేతలు హత్యాయత్నం చేసే వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ఈసీని ప్రశ్నించారు. అసలు ముద్దాయిలను వదిలేసి తప్పులు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేయాలనే ఆలోచనతోనే పిన్నెల్లి ఇంటి దగ్గర బలగాలను తొలగించారని అనుమానం వ్యక్తం చేశారు. పిన్నెల్లికి హాని జరిగితే ఐజీ, ఎస్పీ, డీజీపీదే బాధ్యత అని హెచ్చరించారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×