E-Paper
Advertisement

Municipal Chairperson Election: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక

Municipal Chairperson Election: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
Advertisement

Municipal Chairperson Election: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అటు నెల్లూరు, ఏలూరులో కూడా టీడీపీ మద్దతుదారులుగా నిలిచారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం అయ్యింది. మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేశ్ ఎన్నికయ్యారు. అయితే రమేశ్‌కు అనుకూలంగా 23 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్ధి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓటింగ్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంపీ పార్ధసారథి పాల్గొన్నారు.

దీంతో మున్సిపల్ చైర్మన్‌గా రమేశ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేశ్‌తో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రమేష్‌ను దగ్గరుండి సీట్‌లో కూర్చోబెట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.

Advertisement

ఈ తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా ఆరో వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికైన సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. గత వైసీపీ పరిపాలనతో విసిగిపోయిన ఆ పార్టీ కౌన్సిలర్‌లు టీడీపీలోకి వచ్చారని పేర్కొన్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

నెల్లూరులో రిజల్ట్.. 

Advertisement

నెల్లూరు కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ఫైనల్‌గా నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా తహసీన్ ఎన్నిక అయ్యారు. టీడీపీ నుంచి 48వ డివిజన్ కార్పొరేటర్ తహసీన్‌కు అనుకూలంగా 41 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి కరిముల్లాకు 21 ఓట్లు వచ్చాయి. టీడీపీ, వైసీసీ నేతలు మైనార్టీలను నిలబెట్టడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. దీంతో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితం వచ్చేంది. 41ఓట్లతో నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా తహసీన్ ఎన్నికయ్యారు.

ఏలూరులోనూ టీడీపీదే హవా..

ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు కూడా టీడీపీ కైవసం అయ్యాయి. డిప్యూటీ మేయర్లుగా దుర్గాభవానీ, ఉమామహేశ్వరరావు ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో…
డిప్యూటీ మేయర్లుగా ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు డిక్లేర్ చేశారు.

ఇటు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 18 మంది మద్దతుతో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించింది. మరోవైపు వైసీపీ అభ్యర్థి కేవలం 14 మంది మాత్రమే ఓటు వేశారు. దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×