E-Paper
Advertisement

పిఠాపురం వర్మకు టీడీపీ షాక్.. ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగింపు, అదే కారణమా?

పిఠాపురం వర్మకు టీడీపీ షాక్.. ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగింపు, అదే కారణమా?
Advertisement

Amaravati: టీడీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పించింది. కొద్దిరోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీని వెనుక అసలేం జరిగింది?

పిఠాపురం వర్మకు టీడీపీ షాక్.. ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగింపు

Advertisement

పిఠాపురం నియోజకవర్గం పేరు చెబితేచాలు.. ముందుగా మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ పేరు అందరికీ గుర్తుకు వస్తుంది. సింపుల్ పిఠాపురం వర్మగా పేరుపొందారు. గడిచిన రెండేళ్లుగా ఆ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను టీడీపీ గమనిస్తోంది. ఈ విషయంలో చూసినా వర్మ పేరు బయటకు వస్తోంది. దీంతో కూటమి మధ్య విభేదాలు మొదలయ్యాయంటూ ప్రచారం జరుగుతోంది.

దీన్ని గమనించిన టీడీపీ హైకమాండ్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం నియోజకవర్గం బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ తప్పించింది. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టేసింది.

Advertisement

ప్రోటోకాల్ వ్యవహారంపై పార్టీలో రచ్చ.. పోలిట్ బ్యూరో కమిటీలో సీఎం ప్రస్తావన

కొద్దిరోజుల కిందట పిఠాపురం నియోజకవర్గంలో ప్రోటోకాల్ వ్యవహారంలో వర్మ తీరుపై టీడీపీ హైకమాండ్ కాసింత ఆగ్రహంగా ఉంది. ఆయన తీరుపై సీఎం చంద్రబాబు రుసరుసలాడారు. జరుగుతున్న పరిణామాలతో వర్మ కోరితే ఆ బాధ్యతల నుంచి ఆయన్ని టీడీపీ తప్పించిందా? పార్టీనే వర్మను పక్కన పెట్టిందా? అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది.

ఇటీవల టీడీపీ పోలిట్ బ్యూరో కమిటీల ప్రమాణ స్వీకారానికి వర్మ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు ఆయన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. సమావేశం తర్వాత వర్మ తన కొడుకుతో కలిసి లోకేష్‌ను కలిసినట్లు ప్రచారం ఉంది. అప్పుడే వర్మను పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి, కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు.

ALSO READ: వరుణుడి ‘కూల్’ అప్డేట్.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు.. ఎన్ని రోజులంటే?

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×