E-Paper
Advertisement

Teachers Transfer: ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్..ఉత్తర్వులు జారీ

Teachers Transfer: ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్..ఉత్తర్వులు జారీ
Advertisement

Teachers Transfer: ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. గత ప్రభుత్వం ఇచ్చిన టీచర్ల బదిలీ ఉత్తర్వులను నిలిపివేశారు. ఎటువంటి బదిలీలు చేపట్టవద్దని డీఈఓలకు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో దాదాపు 1,800 మంది టీచర్లను బదిలీ చేశారు. తాజాగా, ఈ అమలును నిలిపివేశారు.

బొత్స ఒత్తిడితోనే జరిగిందా?

Advertisement

రాష్ట్రంలో జూన్ 12న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే మంత్రి వర్గంతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చంద్రబాబు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల సమయంలో వివాదాస్పద నిర్ణయాల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడుతున్నాయి. ప్రధానంగా టీచర్ల బదిలీలకు సంబంధించి పైరవీలు, సిఫార్సులతో జరిగాయనే ఆరోపణలు వినిపించాయి. మరోవైపు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒత్తిడి కారణంగానే సిఫార్సులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీచర్ల బదిలీలు నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో గత ప్రభుత్వం జారీ చేసిన టీచర్ల బదిలీలను విద్యా శాఖ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని సమాచారం.

Also Read: ఎంపీ సీటు త్యాగం, నాగబాబుకు కీలక పదవి!

Advertisement

సర్వత్రా ఉత్కంఠ

టీచర్ల బదిలీలకు సంబంధించి గత ప్రభుత్వం జీఓ నంబర్ 47 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 2023 ఏప్రిల్ వరకు 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతీ ఉద్యోగి బదిలీలకు అర్హులుగా నిర్ణయించింది. అయితే 2022-23 విద్యా సంవత్సరం నాటికి 5 ఏళ్లు ఒకే చోట సర్వీసు పూర్తి చేసిన గ్రేడ్ 2 టీచర్లతోపాటు 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఇతర టీచర్లను తప్పనిసరిగా బదిలీ చేసేలా నిర్ణయానికి వచ్చారు. అయితే వీటిని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ వ్యవహారంపై కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం విచారించే అవకాశం ఉండనుంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×