E-Paper
Advertisement

Chandrababu Health Update : చంద్రబాబుకు ప్రాణహాని ఉందన్న లోకేశ్.. జైళ్ల శాఖ డీజీ వర్షన్ ఇదీ..

Chandrababu Health Update : చంద్రబాబుకు ప్రాణహాని ఉందన్న లోకేశ్.. జైళ్ల శాఖ డీజీ వర్షన్ ఇదీ..
Advertisement

Chandrababu Health Update : రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన చెందారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలను దాచిపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్ దే బాధ్యత అని లోకేష్ పేర్కొన్నారు. జైలులో తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారని, జైలులో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు.

జైల్లో దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతూ.. ఇన్ఫెక్షన్, అలర్జీలతో బాధపడుతున్నారని వాపోయారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆయనను ఉంచుతున్నారని, అది చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందారు. జైల్లో సరైన వైద్యం అందడం లేదని, తక్షణమే వైద్య సహాయం అవసరమని లోకేష్ తెలిపారు. చంద్రబాబునాయుడు భార్య సైతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఆయన 5 కేజీల బరువు తగ్గారని, ఆయనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై .. కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణుల వర్షన్ ఇలా ఉంటే.. జైళ్ల శాఖ డీజీపీ వర్షన్ మరోలా ఉంది.

Advertisement

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైలు శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. జైలులో ఆయన అనారోగ్యానికి గురైన మాట వాస్తవమేనని.. అయితే సరైన టైమ్ లో వైద్యం అందించామని తెలిపారు. బాబు జైలుకు వచ్చినపుడు 66 కేజీల బరువు ఉండగా.. ప్రస్తుతం 67 కేజీల బరువు ఉన్నారని, ఆయన ఒక కిలో బరువు పెరిగారే తప్ప తగ్గలేదని తెలిపారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×