E-Paper
Advertisement

YSRCP : వైసీపీ నేతలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఇదే!

YSRCP : వైసీపీ నేతలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఇదే!
Advertisement

ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నేతల ఆగడాలు శృతి మించుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు తెలుస్తున్నది.అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో ఇష్టానుసారంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బూతులు మాట్లాడటం, దాడులకు పాల్పడటంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులకు చేస్తున్నట్టు సమాచారం. జగన్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు పెద్దఎత్తున ఇల్లీగల్ వ్యాపారాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.విశాఖ జిల్లాలోని మన్యంలో గుట్టుగా గంజాయి పండిస్తూ వాటిని విశాఖతో పాటు ఏపీ మొత్తం వ్యాప్తి చేయడం, తెలంగాణకు సైతం సరఫరా చేస్తున్న ముఠాలకు నాటి వైసీపీ నేతలు అండగా ఉన్నారని సైతం ఆరోపణలొచ్చాయి. దీనంతటికీ నాడు పార్టీ అధినాయకత్వం సైతం చూసీ చూడకుండా వ్యవహరించడంతో కొందరు నేతలు భారీగా డబ్బులు సంపాదించుకున్నట్టు తెలుస్తోంది.

ఆ బడా నేతల అండ.. ఆర్థికసాయం

2019లో వైసీపీ నుంచి గెలిచిన దాదాపు 90 శాతం సభ్యులు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కొందరు గుట్టుగా నాడు పరిచయమున్న అధికారుల అండతో అక్రమ వ్యాపారాలు చేస్తూ భారీగా డబ్బులు సంపాదించుకుంటున్నట్టు తెలుస్తున్నది. వీరే రాష్ట్రంలోని నేతలకు ఆర్థికంగా సపోర్టు చేస్తున్నట్టు సమాచారం. ఇకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించేలా చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి కొందరు వైసీపీ నేతలు గుట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.ఇదే విషయంపై గతంలో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.అందుకే రాష్ట్రంలో వైసీపీ నేతలు, మాజీ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అశాంతిని రేకెత్తించాలని చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు దీటుగా ఎదుర్కొంటున్నారు.

ఓవైపు అసెంబ్లీ, మరోవైపు వెలుపలా..

Advertisement

వైసీపీ నేతలు ప్రజల్లో అటెన్షన్ కొట్టేసేందుకు, వారి హయాంలో జరిగిన అవినీతి, చేసిన అప్పులు, వారిపై ఉన్న కేసుల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. జగన్ సీఎంగా ఉన్నంతకాలం అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం విధ్వంస పాలన సాగించారని, నాడు ప్రభుత్వంపై ప్రశ్నిస్తే దాడులకు పాల్పడిన విషయాలను గుర్తుచేస్తున్నారు. అంతేకానీ, ప్రతిపక్షంతో ఏనాడూ మర్యాదగా మెలగలేదని, నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు సైతం కేటాయించలేదని చెబుతున్నారు. అలాంటి పార్టీకి చెందిన నేతలకు కూటమి సర్కార్ చేస్తున్న అభివృద్ధికి కంటికి కనిపించదని,కేవలం విషప్రచారం చేసి పార్టీని ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నదని.. దీని వెనుక జగన్ హస్తం ఉందని, ఆయన అనుమతి లేకుండా వారు ఇంత ధైర్యం చేయలేరని చెబుతున్నారు.

LPG Supply Rules: సామాన్యులకు భారీ ఊరట.. వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

Advertisement

అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగకుండా సభలో గందరగోళం సృష్టించడం, బయట కూడా రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం వంటివెనుక వైసీపీ మాస్టర్ మైండ్ హస్తం ఉందని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు ఆర్థికంగా బలంగా ఉండటం, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు పార్టీలో ఉండటం, ఇష్టానుసారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలన రాష్ట్రంలో అశాంతికి కుట్ర చేయడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. దీనంతటి వెనుక మాజీ సీఎం జగన్, సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యూహాలు ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి సర్కారుకు నివేదికలు అందినట్టు చర్చ జరుగుతున్నది.

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×