E-Paper
Advertisement

Nandyal Accident: ఆళ్లగడ్డలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి

Nandyal Accident: ఆళ్లగడ్డలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి
Advertisement

Nandyal Accident: ఆళ్లగడ్డలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. ఢీ కొన్న రెండు బస్సులు ప్రైవేటు ట్రావెల్‌కి చెందినవి. తిరుపతి నుంచి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

ఆళ్లగడ్డలో ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులో ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. ఢీ కొన్న రెండు బస్సులు ప్రైవేటు ట్రావెల్ కి చెందినవి. నంద్యాల-తిరుపతి నేషనల్ హవేపై శుక్రవారం వేకువజామున రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొన్నాయి. స్పాట్‌లో ముగ్గురు ప్రయాణికులు మృత్యవాతపడ్డారు.

Advertisement

మరో 20 మంది వరకు గాయపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాయి రెండు ప్రైవేటు బస్సులు. అయితే మార్గ మధ్యలో ఆళ్లగడ్డ సమీపంలోని ఆల్ఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న జగన్ ట్రావెల్స్‌ బస్సుని వెనుక నుంచి వేగంగా వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సులో ఇద్దరు, జగన్‌ ట్రావెల్స్ బస్సులో మరొకరు మృతి చెందారు. ఘటన తర్వాత జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగ్రాతులను సమీపంలోని ఆసుపత్రికి అంబులెన్స్‌ల ద్వారా తరలించారు.

Advertisement

ALSO READ: ఏపీలో హెలికాఫ్టర్ అంబులెన్సులు వస్తున్నాయి.. అంతా ఉచితమే

రెండు బస్సుల మధ్య మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్‌ సాయంతో బయటకు తీశారు. మృతి చెందిన ప్రయాణికులు ఎవరు? ఏ ప్రాంతం నుంచి ఎక్కడకు వెళ్తున్నారు? అనేది తెలియాల్సివుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×