E-Paper
Advertisement

AP News : వానల వేళ కరెంట్‌తో జాగ్రత్త.. ముగ్గురు మృత్యువాత..

AP News : వానల వేళ కరెంట్‌తో జాగ్రత్త.. ముగ్గురు మృత్యువాత..
AP Electric Shock News

AP Electric Shock News(Local news andhra Pradesh) : వేర్వేరు చోట్ల జరిగిన విద్యుత్ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఓ ఇంట్లో కరెంటు రిపేర్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరులో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని శివశంకర్ కి చెప్పగా పరిశీలించేందుకు వెళ్లాడు. ఇదే సమయంలో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. శివశంకర్ అక్కడికక్కడే చనిపోగా.. శ్రీకాంత్ రెడ్డి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు.

కాకినాడ రూరల్ రాయుడుపాలెం జంక్షన్‌లోనూ విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మరణించాడు. భవనంపై కూలి పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఈ ఘటన జరిగింది. మృతుడు సామర్లకోట మండలం హుస్సేన్ పురం వాసిగా గుర్తించారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో కరెంట్‌ షాక్‌తో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×