BigTV English

AP News : వానల వేళ కరెంట్‌తో జాగ్రత్త.. ముగ్గురు మృత్యువాత..

AP News : వానల వేళ కరెంట్‌తో జాగ్రత్త.. ముగ్గురు మృత్యువాత..
AP Electric Shock News


AP Electric Shock News(Local news andhra Pradesh) : వేర్వేరు చోట్ల జరిగిన విద్యుత్ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఓ ఇంట్లో కరెంటు రిపేర్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరులో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని శివశంకర్ కి చెప్పగా పరిశీలించేందుకు వెళ్లాడు. ఇదే సమయంలో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. శివశంకర్ అక్కడికక్కడే చనిపోగా.. శ్రీకాంత్ రెడ్డి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు.


కాకినాడ రూరల్ రాయుడుపాలెం జంక్షన్‌లోనూ విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మరణించాడు. భవనంపై కూలి పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఈ ఘటన జరిగింది. మృతుడు సామర్లకోట మండలం హుస్సేన్ పురం వాసిగా గుర్తించారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో కరెంట్‌ షాక్‌తో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘతానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు.

Related News

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Big Stories

×