E-Paper
Advertisement

Tirumala Adulterated Ghee Case: వైసీపీకి అమావాస్య ఘడియలు, వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్

Tirumala Adulterated Ghee Case: వైసీపీకి అమావాస్య ఘడియలు, వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్
Advertisement

Tirumala Adulterated Ghee Case: అమావాస్య అంటే ఎలాంటి మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టరు. కానీ వైసీపీ నేతలకు అమావాస్యం అంటే ఇష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరేళ్ల తర్వాత వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టుకి హాజరవుతున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సీబీఐ సిట్ అధికారులు వచ్చారు. ఆయన్ని ఈ కేసులో విచారించనున్నారు.

వైసీపీకి వెంటాడుతున్న అమావాస్య ఘడియలు

Advertisement

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు వేగంగా చేస్తోంది సీబీఐ సిట్‌. ఈ కేసులో నెయ్యి సరఫరా చేసిన కంపెనీ ప్రతినిధులు విచారించిన సీబీఐ, చాలామందిని అరెస్టు చేసింది. ప్రస్తుతం టీటీడీ విభాగంలోని కీలకంగా మారిన అప్పటి అధికారులపై దృష్టి పెట్టింది.  ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నను పలుమార్లు సిట్ విచారించింది. అప్పటి టీటీడీ బాస్‌ల ప్రమేయంతో చేసినట్టు వారిద్దరు చెప్పినట్టు తెలుస్తోంది. అంతకుమించి తమకు ఏమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశారట.

తాజాగా ఈ కేసులో వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి గురువారం ఉదయం సిట్ అధికారులు వచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఇంట్లోనే ఆయన్ని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాలు దగ్గర పెట్టి మరీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నెయ్యి సరఫరా చేసిన కంపెనీ ప్రతినిధులు, అలాగే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, పీఏ చిన్న అప్పన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా వైపీపై ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్, ఆపై విచారణ

సిట్ అధికారులు  అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే ఈ రోజు ఆయన విచారణ పూర్తి కావచ్చని,  ఒకవేళ కీలక ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుంటే రేపు కూడా విచారణ చేయవచ్చని అంటున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలుకానున్నాయి. ఈలోగా ఆయన్ని విచారించాలన్నది సిట్ అధికారుల ఆలోచన. సుబ్బారెడ్డిని విచారిస్తే సిట్ దర్యాప్తు దాదాపుగా పూర్తి అయినట్టే. దాన్ని విశ్లేషించి నివేదికను సుప్రీంకోర్టుకు అందించనుంది.

ALSO READ:  ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టుకి జగన్, న్యాయస్థానానికి  గంట సమయం కేటాయింపు

కల్తీ నెయ్యి కేసులో హవాలా లింకులు బయటపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో 12 రాష్ట్రాల్లో విచారణ చేసిన సిట్, ఢిల్లీ కేంద్రంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. భోలేబాబా డైరెక్టర్లు.. కొంత మొత్తాన్ని కల్తీ నెయ్యి తయారీ కోసం నకిలీ రికార్డులు తయారు చేసి కంపెనీలకు హవాలా రూపంలో నిధులు చెల్లించినట్టు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడు.. ఎవరెవరికి ఎంత చెల్లించారు? ఏజెంట్లుగా ఎవరు వ్యవహరించారు? వాటిని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు అధికారులు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×