BigTV English
Advertisement

Tirumala : బ్రహ్మోత్సవాల వేళ.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

Tirumala : బ్రహ్మోత్సవాల వేళ.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

Tirumala : తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు శ్రీవారికి భారీగా కానుకలు సమర్పించారు. ఈ ఏడాది నిర్వహించిన రెండు బ్రహ్మోత్సవాల సమయంలో వేంకటేశ్వర స్వామివారికి హుండీ ద్వారా రూ.47.56 కోట్ల ఆదాయం సమకూరింది.


అధిక మాసం వచ్చిన ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి మూడేళ్లకు ఒకసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శ్రావణమాసం అధికమాసం రావడంతో.. శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. తిరుమలలో మొదటి బ్రహ్మోత్సవాలు(సాలకట్ల బ్రహ్మోత్సవాలు) సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 26 వరకు జరిగాయి. రెండో బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15వ తేదీ నుంచి 23 వరకు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల సమయంలో 11 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 33.78 లక్షల మంది భక్తులకు ఉచితంగా భోజనం అందించామని పేర్కొన్నారు. ఈ సమయంలో 57.64 లక్షలకుపైగా లడ్డూలు అమ్ముడయ్యాయని వివరించారు. 4.29 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు.


బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయన్నారు. టీటీడీ అధికారులు, 23 వేల మందికిపైగా సిబ్బంది, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కృషి చేశారని కరుణాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని స్పష్టం చేశారు.

Tags

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×