E-Paper
Advertisement

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు
Advertisement

YSRCP petition on Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. నిందితులకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనంటూ సామాన్యుల నుంచి మఠాది పీఠాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. లడ్డూపై జరుగుతున్న ప్రచారానికి న్యాయస్థానం ద్వారా అడ్డుకోవాలని ప్లాన్ చేసింది.

తిరుమల లడ్డూ వ్యవహారంపై శుక్రవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది వైసీపీ. అత్యవసరంగా విచారణ జరపాలంటూ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టు తలుపులు తట్టారు. తిరుమల లడ్డూపై నిజాలు నిగ్గు తేలేందుకు కమిటీ వేసి వాస్తవాలు నిగ్గు తేల్చాలని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను వచ్చే బుధవారం విచారణ చేపడతామని తెలిపింది.

Advertisement

తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషన్‌లో పేర్కొంది. తిరుమల ప్రసాదాల్లో జంతువులు కొవ్వు, చేపల నూనె కలిపారంటూ వ్యాఖ్యానించింది. దీనిపై హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీతో విచారణ చేపట్టాలని ప్రస్తావించింది. దీనిపై ప్రస్తుతం నిర్ణయం తీసుకోలేమని, వచ్చే బుధవారం విచారణ చేస్తామని తెలిపింది.

శ్రీవారి లడ్డూ వ్యవహారంలో వైసీపీపై ఇంటా బయటా తీవ్ర దుమారం రేగుతోంది. నేతల కామెంట్స్, టీవీ డిబేట్లు ఆపాలన్నది అందులో ప్రధాన సారాంశం. ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలోకి వెళ్తే ఎవరూ నోరు ఎత్తరన్నది ఆ పార్టీ ఆలోచన.

Advertisement

ALSO READ: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

పిటిషన్‌ను వచ్చేవారానికి వాయిదా పడింది. ఈలోగా టీటీడీ వేసిన కమిటీ విచారణ రాబోతున్నట్లు తెలుస్తోంది. విచారణకు ముందే చర్యలు చేపట్టాలని కూటమి సర్కార్ భావిస్తోంది.  ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు అధికారులపైనా, లేక రాజకీయ నేతలపైనా అనేదానిపై ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వం చెబితే తాము చేశామని అధికారుల్లోని ఓ వర్గం బలంగా చెబుతోంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×