BigTV English
Advertisement

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Ex MP Nandigam Suresh’s house: వైసీపీ మాజీ ఎంసీ నందిగం సురేష్ ఇంట్లో శుక్రవారం ఉదయం పోలీసులు సోదాలు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో పెద్దలు ఎవరు లేకపోవడంతో నోటీసులు గోడకు అంటించి వెళ్లిపోయారు పోలీసులు. ఇంటికి సంబంధించినవారు ఎవరైనా వస్తే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులు పేర్కొన్నారు.


ఇంతకీ పోలీసులు ఎందుకు సోదాలు చేశారు? సోదాల వెనుక అసలేం జరుగుతోంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో ఆయనను రెండురోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించారు. దాని ఆధారంగా సోదాలు చేసినట్టు తెలుస్తోంది.

ALSO READ: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్


ఇంతకీ సురేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏంటి? సురేష్ భార్య గానీ, ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవడంతో నోటీసు అంటించారు. దాడి జరిగిన రోజు ఫోటోలు, విజువల్స్ దగ్గర పెట్టి విచారణ చేపట్టారు పోలీసులు.  ఫోటోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపు 60 ప్రశ్నలు ఆయనను అడిగినట్టు సమాచారం.

అందులో కొన్నింటికి రిప్లై ఇచ్చారట. దాని ఆధారంగానే సోదాలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జైలులో ఉన్నారాయన. గురువారంతో ఆయన రిమాండ్ ముగిసింది. దీంతో పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఆయనకు వచ్చే నెల మూడు వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెల్సిందే.

 

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×