E-Paper
Advertisement

Tirumala: తిరుమలలో మరో వివాదం.. తట్టల షాపుల అనుమతులు రద్దు..?

Tirumala: తిరుమలలో మరో వివాదం.. తట్టల షాపుల అనుమతులు రద్దు..?
Advertisement

Tirumala: తిరుమలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రక్షాళన చేపట్టిందన్నారు తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్. తిరుమలలో తట్టల షాపుల పేరుతో కొత్త గోల మొదలైందని.. ఇది జనసేన పార్టీ మీదకు తీసుకువస్తున్నారని కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదిరోజులుగా భక్తులు నడవకుండా ఈ తట్టలు వెలిశాయని.. గత ప్రభుత్వంలోని టీటీడీ పాలకమండి ఛైర్మన్లు, ఈవో, తుడా ఛైర్మన్, మరో మంత్రి బంధువులకు ,అనునాయులకు 250 తట్టలు ఇచ్చారన్నారు. తట్టలు కోట్లలో జరిగే స్కాం అని.. 20 ఏళ్లలో అక్రమంగా తట్టలు ఏర్పాటు చేసి.. తిరుమలలో భక్తులకు సేవలందించాలన్నారు. అలాగే లైసెన్స్ లేని తట్టలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

టీటీడీ నుండి అధికారికంగా అనుమతులు పొంది అద్దెలు చెల్లిస్తున్న హాకర్ల సంఖ్య 620 మంది మాత్రమే. కాగా ఇప్పుడు కొండపై దాదాపు 1300 మంది అనధికారిక తట్టలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం 29 మంది మాత్రమే నడుపుతున్న టీ స్టాల్స్ ఇప్పుడు 128 కి చేరుకున్నాయి. టీటీడీ ఆరోగ్య శాఖ అసలు ఇంతమందికి టీ కాఫీలు అమ్ముకోవడానికి లైసెన్సులు ఎలా మంజూరు చేసిందో, దానికి ప్రామాణికం ఏమిటో ఎవరికి అర్థం కాదు.

Advertisement

కేవలం 16 మంది మాత్రమే వడ్డీకాసులు విక్రయించే వ్యాపారులు ఉండగా ఇప్పుడు 70 మంది వ్యాపారులు లైసెన్సులు పొందారు. కేవలం 13 మంది ఫోటోగ్రాఫర్ లైసెన్సులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 34 కు చేరింది. పండ్లు అమ్ముకునే వారు 28 మంది మాత్రమే లైసెన్సులు ఉండగా అనధికారికంగా మరో వంద మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు.

Also Read: రచ్చ లేపిన ఫ్లెక్సీ.. కేడర్ మధ్య కర్రలతో ఫైటింగ్, అసలేం జరిగింది?

Advertisement

కూటమి ప్రభుత్వంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకుని వారిని తొలగించి ప్రక్షాళన చేస్తారని నాయకులు తెలిపారు. తిరుమలలో అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయి. గత పాలనలో అందిన కాడికి దోచుకున్నారు. ఆ ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడుతుందన్నారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×