E-Paper
Advertisement

స్టీల్‌ప్లాంట్ ఘటన.. తిరుపతి కూటమి సభ వాయిదా, విశాఖకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్

స్టీల్‌ప్లాంట్ ఘటన.. తిరుపతి కూటమి సభ వాయిదా, విశాఖకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్
Advertisement

Visakhapatnam: తిరుపతిలో మంగళవారం కూటమి ప్రభుత్వం తలపెట్టిన బహిరంగ సభ అనుకోకుండా వాయిదా వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ విశాఖకు వెళ్లనున్నారు.

అనుకోకుండా తిరుపతి కూటమి సభ వాయిదా

Advertisement

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయోత్సవ సభను సంక్షేమం పేరిట నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మూడు సభలకు ప్లాన్ చేశారు. మంగళవారం తిరుపతి వేదికగా తొలి విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

సభను విజయవంతం చేసేందుకు రెండు రోజులుగా కూటమి నేతలు, క్షేత్రస్థాయిలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే సోమవారం సాయంత్రం విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్‌లు కలిసి సభ నిర్వహణపై సంప్రదింపులు జరిపారు.

Advertisement

స్టీల్‌ప్లాంట్ ఘటన.. విశాఖకు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్

చివరకు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లు చేసిన సభను తిరిగి అదే ప్రాంగణంలో జూన్ 12న భారీ సభ నిర్వహించనున్నారు. స్టీల్‌ప్లాంట్ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విశాఖకు రానున్నారు.

ఘటనలో మృతి చెందిన ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులను ఓదార్చు నున్నారు. కిమ్స్-సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించునున్నారు. ఆ తర్వాత స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.  ఘటన గురించి అధికారులను నుంచి సమాచారం తీసుకోనున్నారు.

Related News

మడ అడవుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ రికార్డు.. అటవీ శాఖకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి.. ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

డీఎస్సీ లీకులు.. విద్యాదీవెనకు దిక్కులేదు.. కూటమి పాలనపై బొత్స సంచలన కామెంట్స్!

తిరువణ్ణామలై కొండపై మరో దారుణం.. ఇరుకైన రంధ్రంలో చిక్కుకున్న మహిళా భక్తురాలు!

పోలవరం స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!

అంబటితో వేదిక పంచుకున్న బోండా ఉమా.. చంద్రబాబు రియాక్షన్ చూస్తే మైండ్ బ్లాకే!

ఏమరుపాటు వద్దు.. టార్గెట్ నెలన్నర- సీఎం చంద్రబాబు

వైఎస్ షర్మిలకు ఆపరేషన్.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్, అన్నయ్య వచ్చారా?

Big Stories

Advertisement
×