E-Paper
Advertisement

Kurnool Bus Tragedy: సీట్లలో అస్థిపంజరాలు.. మాంసపు ముద్దలు.. కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Kurnool Bus Tragedy: సీట్లలో అస్థిపంజరాలు.. మాంసపు ముద్దలు.. కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై హైమా రెడ్డిఅనే ప్రత్యక్ష సాక్షి కీలక విషయాలు వెల్లడించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. బస్సు తగలబడుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లాను. కాలిపోతున్న బస్సులో ప్రయణాకుల అస్తిపంజరాలు, మాంసపు ముద్దలను చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే కర్నూలు ఎస్పీకి ఫోన్ చేశాను అని పేర్కొన్నారు.

కాగా.. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నేషనల్ హైవే-44 పై  బైక్‌ని ఢీ కొట్టింది ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు సజీవదహనం అయ్యారు. ఎమర్జెన్సీ డోర్‌ నుంచి 20 నుంచి 25 మంది వరకు బయటపడినట్లు తెలుస్తోంది. 20 మంది వరకు దుర్మరణం చెందినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Also Read: కర్నూలు బస్సు ఘటన.. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడి మాటల్లో

బస్సు గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరిందని.. కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయన్నారు. గమనించిన డ్రైవర్‌, సహాయక డ్రైవర్‌ను నిద్రలేపాడు. చిన్న ప్రమాదమనుకుని వాటర్‌ బబుల్‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. మంటలుఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్రలేపారు. కొందరు ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి కొందరు బయటపడ్డారు. డ్రైవర్‌, సహాయక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం అని తెలిపారు.

 

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×