ఇటీవల ఓ జంట విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత మహిళలకు భరణం ఇవ్వడం పై క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగం అలాగే జీతం ఉన్న మహిళలకు భరణం ఎందుకు అంటూ ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు. డబ్బులు సంపాదించుకునే మార్గం లేని, మహిళలకు భరణం ఇస్తే అర్థం ఉంటుందని వెల్లడించింది. ఎలాంటి సంపాదన లేనివాళ్లు, పనిచేయలేని పరిస్థితిలో ఉన్న మహిళలకు మాత్రమే భరణం ఇవ్వాలని కోర్టు వెల్లడించింది. కానీ డబ్బులు సొంతంగా సంపాదించుకునే మహిళలతో పాటు ఉద్యోగం చేసుకునే వాళ్లకు భరణ నివ్వాల్సిన పనిలేదని కోర్టు తెలిపింది. ఇదే తీర్పులో తాజాగా చాహల్ షేర్ చేశాడు. తన మాజీ భార్య ధనశ్రీ వర్మ సొంతంగా డబ్బులు సంపాదించుకుంటుంది. సోషల్ మీడియా అలాగే ఇప్పుడు సినిమాల ద్వారా బాగానే అర్జిస్తోంది. అయినా కూడా తన దగ్గర ఆమె మరణం తీసుకుందని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు చాహల్.
యుజ్వేంద్ర చాహల్ అలాగే ధనశ్రీ వర్మ 2020 సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు రెండు సంవత్సరాలు కాపురం చేసిన… ఇటీవల విడాకులు తీసుకుంది. ముంబై ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకుల సందర్భంగా దాదాపు 60 కోట్ల భరణం ఇవ్వాలని చాహల్ పైన ఒత్తిడి తెచ్చిందట ధనశ్రీ వర్మ. దీనికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కానీ చివరికి కోర్టు తీర్పు మేరకు 4.75 కోట్లు భరణం ఇచ్చేందుకు చాహల్ ఒప్పుకున్నాడట. ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆర్జే మహ్వాష్ తో చాహల్ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమెను త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమా చేసేందుకు ధన శ్రీ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఎవరి లైఫ్ వారు ఎంజాయ్ చేస్తున్నారు.