Road Accident: ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకు రకరకాల కారణాలు లేకపోలేదు. సరిగ్గా సోమవారం అలాంటి ఘటన ఒకటి ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ట్రావెల్ బస్సు నేరుగా డివైడర్ ని ఢీ కొట్టింది. అసలేం జరిగింది?
ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు
2024 ఏడాదిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దారుణమైన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వం, ప్రైవేటు బస్సు ప్రమాదాల్లో చాలామంది చనిపోయారు. ముఖ్యంగా ఏపీలోని కర్నూలు- తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 19 చొప్పున మృత్యువాతపడ్డారు.
ఆ ఘటన నుంచి ఇప్పుడిప్పుడు ప్రజలు తేరుకుంటున్నారు. అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రకాశం జిల్లా దోర్నాల ఘాట్ వద్ద ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు.. దొర్నాల ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ అయ్యింది. ఆ వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు డ్రైవర్.
ప్రకాశం జిల్లాలో ఘటన.. డివైడర్ని ఢీకొట్టిన బస్సు
దీంతో బస్సు డివైడర్ని బలంగా ఢీ కొట్టింది. చిన్నదైతే లోయలోకి బస్సుపోయేది. డివైడర్కి మధ్యలో ఉంది. ఘటన సమయంలో బస్సులో 40 మంది భవానీలు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
డ్రైవర్ వైపు కిటికీల నుంచి స్వాములు మెల్లా బయటపడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన గురించి వివరాలు ఆరా తీశారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు స్వాములు. తమను ఏ దేవుడో కాపాడాడని చెబుతున్నారు.
ALSO READ: అడ్డంగా బుక్కైన ఓ యువకుడు.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పోస్టు
అసలే చలికాలం.. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అంటూ పదే పదే హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
బ్రేక్ ఫెయిల్ కావడంతో డివైడర్ ను ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తుండగా దోర్నాల ఘాట్ వద్ద ఘటన
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది భవానీలు
ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు pic.twitter.com/KyRo8U3TR8
— BIG TV Breaking News (@bigtvtelugu) December 15, 2025