BigTV English

Kadapa Crime: మిగ్ జాం ఎఫెక్ట్.. చెట్టుకూలి కానిస్టేబుల్ మృతి

Kadapa Crime: మిగ్ జాం ఎఫెక్ట్.. చెట్టుకూలి కానిస్టేబుల్ మృతి

Kadapa Crime: ఏపీలో మిగ్ జాం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ, అతిభారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నేలకొరిగి, నీటమునగడంతో రైతన్నకు మళ్లీ అపార నష్టం వాటిల్లింది. చెట్లు నేలకొరిగి, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నానికి బాపట్ల వద్ద తీరం దాటుతుందని, ఆ సమయంలో తుపాను బీభత్సం సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు.


తుపాను బీభత్సానికి ఒక కానిస్టేబుల్ ప్రాణం కోల్పోయాడు. వైఎస్సార్ కడప జిల్లా భాకరాపేటలో విధులు నిర్వహిస్తున్నట్లు కానిస్టేబుల్ పై చెట్టు విరిగిపడి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. భాకరాపేట సమీపంలో మలినేనిపట్నం వద్ద కానిస్టేబుల్ సత్యకుమార్ బైక్ పై వెళ్తున్నాడు. ఒకవైపు భారీ వర్షం.. మరోవైపు ఈదురుగాలులు.. అదే సమయంలో సత్యకుమార్ పై చెట్టు విరిగిపడింది. దాంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

సత్యకుమార్ 2004వ బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ గా గుర్తించారు. సత్యకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సత్యకుమార్ అకాల మరణంతో.. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.


Tags

Related News

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

Big Stories

×