E-Paper
Advertisement

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్
Advertisement

TTD Chairman BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భారతదేశంలోని.. అత్యంత పవిత్రమైన యాత్రా కేంద్రాలలో ఒకటి. ఇక్కడ ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలివస్తారు. అలాంటి తిరుమలలో భక్తులకు క్రమబద్ధమైన దర్శనం కల్పించడమే కాకుండా, సేవకులకు కూడా ప్రోత్సాహకరమైన సదుపాయాలు అందించడానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది టీటీడీ.

తాజాగా తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి సేవకులు స్వామివారిని మరింత దగ్గరగా దర్శించుకునే భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. త్వరలో పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

సేవకుల త్యాగానికి గౌరవం

తిరుమలలో ప్రతిరోజూ వేలాది మంది సేవకులు భక్తుల కోసం వసతి, అన్నప్రసాదాల పంపిణీ, దారినడిపించడం, వైద్య సహాయం వంటి పలు రంగాలలో సేవలు అందిస్తున్నారు. ఇంతటి నిస్వార్థమైన సేవకు గుర్తింపుగా వారికి శ్రీవారి దగ్గర దర్శన అవకాశం ఇవ్వడం.. ఒక గొప్ప నిర్ణయమని భక్తులు అభినందిస్తున్నారు.

Advertisement

బోర్డు సమావేశంలో చర్చ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఆస్థాన మండపంలో సమావేశమైన టీటీడీ చైర్మన్ వారికి దిశా నిర్ధేశం చేశారు. శ్రీవారి సేవకులు భగవత్ బంధువులు అన్నారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడిలో భగవంతుడు ఉన్నాడని భక్తులకు సేవ చేస్తే స్వామికి సేవ చేసినట్లే అన్నారు. శ్రీవారి సేవ చేసేందుకు దేశంలోని ఎందరో ప్రముఖులు ముందుకు వస్తున్నారని, సేవచేసేందుకు పోటీ పడుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం శ్రీవారి సేవకుల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు.

కొత్త మార్పులకు దారి

ఈ నిర్ణయం ద్వారా తిరుమలలో సేవా స్ఫూర్తి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే, స్వామివారి సమీప దర్శనం అనేది ప్రతి భక్తుడి జీవితంలో ఒక ప్రత్యేక అనుభూతి. ఆ అవకాశాన్ని సేవకులకు కల్పించడం ద్వారా, మరింతమంది భక్తులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకు వస్తారు.

త్వరలో అధికారిక ప్రకటన

బీఆర్ నాయుడు తెలిపిన ప్రకారం, టీటీడీ ఈ నిర్ణయంపై తుది రూపురేఖలు సిద్ధం చేసిన వెంటనే అధికారికంగా ప్రకటన చేస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు, నియమ నిబంధనలు కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.

Also Read: Group-1 వివాదం మరో మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

తిరుమలలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలోనే కాకుండా, సేవకుల త్యాగానికి గుర్తింపుగా తీసుకుంటున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని చెప్పవచ్చు. టీటీడీ బోర్డు ఈ నిర్ణయాన్ని త్వరగా అమలు చేస్తే, సేవకులలో మరింత ఉత్సాహం పెరుగుతుంది. అదే సమయంలో తిరుమల సేవా పద్ధతి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×