E-Paper
Advertisement

TTD Vigilance: పోలీసులకు ఎదురుగా వెళ్లిన పుష్ప.. దడ పుట్టించిన టీటీడీ విజిలెన్స్

TTD Vigilance: పోలీసులకు ఎదురుగా వెళ్లిన పుష్ప.. దడ పుట్టించిన టీటీడీ విజిలెన్స్
Advertisement

TTD Vigilance: పుష్ప సినిమా ఫీవర్ ఏమో కానీ, ఇటీవల పుష్పాల ఆట కట్టించేందుకు పోలీసులు మాత్రం, సినిమాలోని పోలీస్ ఆఫీసర్ పాత్ర షేకావత్ కంటే వేగంగా పావులు కదుపుతున్నారు. దీనితో పుష్పలు ఇట్టే పోలీసులకు చిక్కుతున్నారని చెప్పవచ్చు. శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల నుండి ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ, పలువురు స్మగ్లర్లు టీటీడీ విజిలెన్స్ అధికారులకు గురువారం పట్టుబడ్డారు.

అందిన వివరాల మేరకు..
శేషాచలం అడవుల్లో నుండి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. తిరుమల నుండి ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతుందని టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీనితో పక్కా ప్రణాళిక రచించి అటవీ అధికారులు, స్మగ్లర్ల ఆట కట్టించారు.

Advertisement

గురువారం సాయంత్రం కారులో అక్రమంగా ఎర్రచందనం రవాణా అవుతున్నట్లు సమాచారం అందుకొని, వాహన తనిఖీల నిమిత్తం కారును శిలా తోరణము సమీపంలో నిలిపివేశారు. కారును తనిఖీ చేయగా, వెనుక సీటులో గ్రేడ్-ఏ కు చెందిన ఎర్రచందనం దుంగలు పోలీసులకు కారులో కంటపడ్డాయి. ఓవైపు తనిఖీలు జరుగుతుండగా, మరోవైపు కారు డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

Also Read: Pawan Kalyan: పాపులారిటీ ఉంటే మేధావులు కానే కారు.. పవన్ సంచలన కామెంట్స్

Advertisement

గమనించిన సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని, కారును సీజ్ చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పవిత్రమైన తిరుమల నుండి ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు పక్కా ప్రణాళికతో స్మగ్లర్ల ఆట కట్టించారు. అయితే స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ తెలియాల్సి ఉంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×